ఐడియా

తాజా చర్మం కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాతావరణంలో మార్పులు కారణంగా చర్మంలో పిగ్మెంటేషన్ మొదలవుతుంది. అలాకాకుండా ముఖం ఎప్పుడూ తాజాగా ఉండాలంటే ఈ వానాకాలంలో అప్పడప్పుడూ ఇంట్లో తయారుచేసుకునే ఫేస్ ప్యాక్‌లను వాడాలి. అప్పుడే చర్మం బిగుతుగా మారి అందంగా కాంతులీనుతూ ఉంటుంది.
* రెండు విటమిన్ మాత్రలను కట్‌చేసి అందులోని నూనెను ఒక కప్పులో వేయాలి. అందులో రెండు చెంచాల పెరుగు, నిమ్మరసం కలిపి ముఖం, మెడకు రాయాలి. పది నిముషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
* అరకప్పు పెసరపిండిని తీసుకుని అందులో ఒక స్పూన్ తేనె, రెండు స్పూన్ల కీరా జూస్, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని నెమ్మదిగా కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖంపై పొల్యూషన్ వల్లకానీ, వాతావరణ మార్పుల వల్ల కానీ ఏర్పడిన పిగ్మెంటేషన్ దూరమై చర్మం ఎంతో కాంతులీనుతుంది.
* ఆలివ్ నూనె, జొజోబా నూనెను ముఖానికి పూసి బాగా మర్దనా చేసి కాసేపు వదిలేయాలి. తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వల్ల చర్మం బిగుతుగా, అందంగా, మెరుస్తూ ఉంటుంది.
* రెండు స్పూన్ల పెసరపిండిలో కొద్దిగా పాలు, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత కడిగేయడం వల్ల ముఖంపై ఉన్న మలినాలు తొలగిపోయి ముఖం తాజాగా ఉంటుంది.
* గుడ్డులోని తెల్లసొనలో మూడు చెంచాల కీరదోసరసం కలిపి ముఖం, మెడకు రాసుకుని బాగా మర్దనా చేయాలి. ఇది పూర్తిగా ఆరాక ముఖం కడగాలి. ఈ మిశ్రమాన్ని రాసుకున్నప్పుడు అస్సలు మాట్లాడకూడదు. లేకపోతే చర్మం ముడుతలు పడిపోవచ్చు.
* అరకప్పు పెసరపిండిలో రెండు సూన్ల పెరుగు, ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత గోరువెచ్చటి నీటితో కడగడం వల్ల ముఖంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి చర్మం తాజాగా, కాంతులీనుతూ ఉంటుంది.
* బొప్పాయి పండు ముక్కని తీసుకుని బాగా మెత్తగా చిదిమి, అందులో ఒక స్పూన్ తేనెను కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిముషాల తర్వాత కడిగేస్తే ముఖంపైనున్న మురికి తొలగిపోతుంది.
* అరటిపండు గుజ్జును తీసుకుని అందులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే కూడా ముఖం కాంతులీనుతుంది.
* రాత్రి పడుకునేముందు చల్లని పాలలో దూదిని ముంచి ముఖానికి పూసి ఆరిన తరువాత నీళ్లతో కడిగేసుకుంటే ముఖంపై ఉన్న మలినాలు తొలగిపోతాయి. చర్మం నునుపుగా, కాంతులీనుతుంది.