కరీంనగర్

12మంది తహశీల్దార్లకు పోస్టింగ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, మార్చి 26: జిల్లాలో పనిచేస్తున్న వారితోపాటు వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తూ జిల్లాకు వచ్చిన 12మంది తహశీల్దార్లకు జిల్లాలో పోస్టింగ్‌లు కల్పిస్తూ శనివారం జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో సూపరింటెండెంట్-హెచ్‌గా ఉన్న ఎం.డి.అలీమొద్దిన్‌ను ఇక్కడే పోస్టింగ్ ఇవ్వగా, వరంగల్ నుంచి వచ్చిన ఎ.రమాదేవికి సైదాపూర్ తహశీల్దార్‌గా పోస్టింగ్ ఇచ్చారు. అలాగే వరంగల్ నుంచి వచ్చిన పి.రేణుకాదేవి ముస్తాబాద్ తహశీల్దార్‌గా, ఆదిలాబాద్ నుంచి వచ్చిన బి.మహేందర్‌నాథ్ మహముత్తారం తహశీల్దార్‌గా, సి.రాంమోహన్ ధర్మారం తహశీల్దార్‌గా, మల్యాల తహాశీల్దార్‌గా ఉన్న పి.శ్రీహరిరెడ్డికి ఇక్కడే పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఆదిలాబాద్ నుంచి వచ్చిన పి.హనుమంతరావు కమాన్‌పూర్ తహశీల్దార్‌గా, ఖమ్మం నుంచి వచ్చిన డి.ప్రసాద్ గంభీరావుపేట తహశీల్దార్‌గా, ఆదిలాబాద్ నుంచి వచ్చిన బి.సుధాకర్ కాల్వశ్రీరాంపూర్ తహశీల్దార్‌గా, వరంగల్ నుంచి వచ్చిన కె.కేదారి భీమదేవరపల్లి తహశీల్దార్‌గా, కరీంనగర్ ఆర్‌డిఓ కార్యాలయంలో ఉన్న ఎన్.రాజేశ్ జగిత్యాల సబ్ కలెక్టర్ కార్యాలయానికి, సైదాపూర్ తహశీల్దార్‌గా ఉన్న పి.కిరణ్‌కుమార్ పెద్దపల్లి ఆర్డీఓ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.