కరీంనగర్

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా రంగి సత్యనారాయణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంథని, ఆగస్టు 30: సంస్కృత భాషా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా మంథని పట్టణానికి చెందిన రంగి సత్యనారయణ ఎంపికయ్యారు. మంథని పట్టణానికి చెందిన సత్యనారాయణ ప్రస్తుతం హైదరాబాదులోని ఉప్పల్ కేంద్రియ విద్యాలయంలో సంస్కృత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. వచ్చేనెల 5న ఢిల్లీలో జరిగే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో సత్యనారాయణ పురస్కరాన్ని అందుకోనున్నారు. జాతీయ సంస్కృత ఉపాధ్యాయునిగా మంథని ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయుడు ఎంపిక కావడం పట్ల మంథని పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.