కరీంనగర్

టిడిపి జిల్లా అధ్యక్షుడితో పాటు మరో పది మంది అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, ఆగస్టు 30: ఆర్టీసీ బస్సు అద్దాన్ని, ఎస్సారెస్పీ కార్యాలయంలో ఫర్నీచర్ ధ్వంసం చేసిన రెండు కేసుల్లో మంగళవారం టిడిపి జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావుతో పాటు మరో పది మందిని మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్‌ఐ బి.జీవన్ తెలిపారు. ఈనెల 26న మండల కేంద్రంలోని రాజీవ్ రహదారిపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎస్సారెస్పీ కాలువ నీటిని పూర్తిస్థాయిలో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొంత మంది ఆందోళనకారులు బస్సు అద్దంతో పాటు ఎస్సారెస్పీ కార్యాలయంలో ఫర్నీచర్ ధ్వంసమైంది. ఈ కేసుల్లో నిందితులను మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. అరెస్టయిన వారిలో పార్టీ నేతలు గంట రాములు, సాయిరి మహేందర్, కల్లెపల్లి జానీ, కుమార్ కిశోర్, వెగోళం అబ్బయ్య, గణేష్, సతీష్, సతీష్ రెడ్డి, సంతోష్, గట్టు యాదవ్‌లు ఉన్నట్లు ఎస్‌ఐ వివరించారు.