కరీంనగర్

బాలికపై అత్యాచారం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డిపేట, మే 15: మండలంలోని నారాయణపూర్‌లోని ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లే క్రమంలో పంచాయతీ పెద్దలు రంగప్రవేశం చేశారని తెలిసింది. పంచాయతీ నిర్వహించి బాలిక శీలానికి రూ.50వేలు ఖరీదు కట్టినట్లు సమాచారం. ఈ తతంగమంతా గ్రామ పోలీసుల కనుసన్నల్లోనే జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాల్సింది పోయి యువకుడికే పోలీసులు అండగా నిలుస్తున్నారని వాపోతున్నారు. పంచాయితీ నిర్వహించిన పెద్దలు రూ.30వేలు తీసుకొన్నారని పేర్కొన్నారు. పంచాయతీ తీర్పునకు కట్టుబడి ఉండాలని హెచ్చరించినట్లు బాలిక తల్లిదండ్రులు వాపోతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఘటనపై ఎస్‌ఐ ఉపేందర్‌ను వివరణ కోరగా అత్యాచార ఘటన తమ దృష్టికి రాలేదని స్పష్టం చేశారు.