కరీంనగర్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీణవంక, జూన్ 17: మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన శీలం సమ్మిరెడ్డి (48) అనే రైతు శుక్రవారం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సమ్మిరెడ్డికి మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రెండేళ్లుగా పంట సరిగా పండడం లేదు. గ్రామంలోని నాలుగు లక్షల వరకు అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేమనే బెంగతో కొద్ది రోజులుగా మనస్థాపం చెందుతున్నాడు. మధ్యాహ్నం ఇంటిలో ఎవరు లేని సమయంలో తన ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. మృతుని భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దామోదర్‌రెడ్డి తెలిపారు.

-