మహబూబ్‌నగర్

అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ పాటుపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, ఏప్రిల్ 14: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ ఆశయసిద్ధి కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలంటూ మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం మక్తల్ పట్టణంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వసించారు. ఈనేపథ్యంలో అంబేద్కర్ చౌరస్తాలో బాబా సాహేబ్‌కు ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, బిజెపి నాయకుడు కొండయ్య, టిఆర్‌ఎస్ నాయకులు దేవరి మల్లప్ప, విహెచ్‌పి నేతలు భీంరెడ్డి, టిడిపి నేతలు చంద్రకాంత్‌గౌడ్‌లతోపాటు తహశీల్దార్ ఓంప్రకాష్, ఎంపిడిఓ జయశంకర్ ప్రసాద్, ఎంపిపి కోళ్ల పద్మమ్మ, బిఎస్‌పి నాయకులు కోరిమారెప్ప తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలువేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి మాట్లాడుతూ అణగారిన వర్గాల్లో పుట్టి రాజ్యాంగ నిర్మాత వరకు ఎదిగిన మహానుభావుడన్నారు. కార్యక్రమంలో నేతలు రాజుల ఆశిరెడ్డి, గోపాల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, హన్మంతు, సి.చంద్రశేఖర్, కర్నిస్వామి, పాల్గొన్నారు.
విహెచ్‌పి ఆధ్వర్యంలో...
మక్తల్ పట్టణంలో అంబేద్కర్ జయంతి వేడుకలను విహెచ్‌పి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈనేపథ్యంలో విహెచ్‌పి జిల్లా సహకార్యదర్శి వి.్భంరెడ్డి, జనార్ధన్ ముదిరాజ్, బాలాజీ, సత్యనారాయగౌడ్‌లు బాబా సాహేబ్‌కు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.