మహబూబ్‌నగర్

అప్పుల బాధ భరించలేక... రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధన్వాడ, ఏఫ్రిల్ 15: అప్పుల బాద భరించలేక రైతు క్రిమిసంహరక మందును సేవించి మృతి చెందిన సంఘటన ధన్వాడ మండంలో శుక్రవారం చోటు చేసుకుంది. మరికల్ ఎఎస్సై బాల్‌రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలంలోని వెంకటపురం గ్రామానికి చెందిన కుర్వ దశరత్ (31) అనే రైతు గురువారం సాయంత్రం తన పోలం వద్ద క్రిమిసంహరక మందును సేవించాడు. పక్కపోలం వారు గమనించి రైతు దశరత్‌ను చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పోందుతూ శుక్రవారం తెల్లవారు జామున ఆసుపత్రిలోనే మృతి చెందినట్లు అయన తెలిపారు. రైతు దశరత్ పంట సాగుకై చేసిన అప్పుల బాధతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పులు దాదాపు రూ.4లక్షలు ఉన్నట్లు తెలిపారు. రైతు దశరత్ తండ్రి కుర్వరాములు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్సై బాల్‌రెడ్డి తెలిపారు.