మహబూబ్‌నగర్

టీఆర్‌ఎస్‌తోనే బంగారు తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖిల్లాఘనపూర్, సెప్టెంబర్ 24: టీఆర్‌ఎస్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని అపద్దర్మ డిప్యూటి సిఎం మహమూద్ అలి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పద్మశాలి కళ్యాణ మండపం పక్కన ముస్లీంలకు రూ.25లక్షలతో షాదిఖానా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎస్సీ కాలనీలో అంబేద్కర్ భవన నిర్మాణానికి రూ. 20 లక్షలు మంజూరు చేసి రాష్ఠ్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే బంగారు తెలంగాణ సాధ్యమని ఆయన అన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు షాదిముబారక్, కళ్యాణలక్ష్మి, రైతుబందు, రైతుబీమా, డబుల్‌బెడ్రూం ఇళ్ళు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కృష్ణానాయక్, జడ్పిటిసి రమేష్‌గౌడ్, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.