మహబూబ్‌నగర్

పాఠ్యపుస్తకాలు సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమనగల్లు, జూన్ 17: ఆమనగల్లు మండలంలోని కడ్తాల గ్రామంలో ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు విక్రయించిన పాఠ్య పుస్తకాలను సీజ్ చేసినట్లు ఆమనగల్లు ఎంఇఓ కిషన్ తెలిపారు. కడ్తాల గ్రామంలో ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు కుమ్మకై వారు ముద్రించిన పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందజేసి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని కడ్తాల గ్రామానికి వివేకానంద యువజన సంఘం అధ్యక్షులు రాజలింగం, జిల్లా కలెక్టర్ శ్రీదేవితో పాటు జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం గ్రామంలో ఉన్న ప్రగతి ఉన్నత పాఠశాల, కృష్ణవేణి పాఠశాలలో విద్యాశాఖ అధికారులు, గ్రామ విఆర్‌ఓలు తనిఖీలు నిర్వహించి ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు ముద్రించిన లక్షల రుపాయల విలువ చేసే పాఠ్య పుస్తకాలను సీజ్ చేసినట్లు ఎంఇఓ తెలిపారు.