మహబూబ్‌నగర్

ఉనికి కోసమే ప్రతిపక్షాల ఆరోపణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, జూన్ 26: రాష్ట్రంలో పలు పార్టీలు తమ ఉనికి కోసమే రాష్ట్ర ప్రభుత్వపై అసత్య అరోపణలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ ఉనికి కోసమే ప్రభుత్వంపై అరోపణలు చేస్తున్నారని, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గల్లంతు అయిందని, ఉన్న వారు కూడా రేపో మాపో టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతారని, ప్రత్యేక తెలంగాణ సాధనలో ముఖ్యమంత్రి ఎంతో కృషి చేశారో బంగారు తెలంగాణ సాధన కోసం పట్టుదలతో ఉన్నారని, తెలంగాణలోని ప్రాజెక్టులను పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరు అందించడమే ముఖ్యమంత్రి లక్ష్యమని ఆయన అన్నారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు బాలాజీసింగ్, అశోక్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.