మహబూబ్నగర్
సమష్టి సహకారంతోనే తెలంగాణ అభివృద్ధి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కొత్తూరు, ఆగస్టు 28: ప్రజలందరి సహకారంతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ద్ధి సాధ్యమవుతుందని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. ఆదివారం కొత్తూరు మండలం చేగూరు గ్రామంలో నూతన ముదిరాజ్ భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేయడంతో పాటు ప్రైవేట్ వైద్యశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్వామిగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధ్దిలో ప్రజలందరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ద్ధికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ స్వయం శక్తితో ముందుకు సాగాలని అన్నారు. దేశాభివృద్దిలో యువత పాలు పంచుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని వివరించారు. ముదిరాజ్ నూతన భవన నిర్మాణానికి స్థానిక శాసన సభ్యులు ఎల్గనమోని అంజయ్య యాదవ్ నియోజకవర్గ అభివృద్ది నిధుల నుండి ఐదు లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని అన్నారు. నియోజకవర్గ అభివృద్దిలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డి, జడ్పివైస్ చైర్మన్ నవీన్రెడ్డి, ఎంపిపి శివశంకర్గౌడ్, స్థానిక సర్పంచ్ పాండయ్య, సింగిల్విండో చైర్మన్ విఠల్ ముదిరాజ్, టిఆర్ఎస్ గ్రామ కమిటి అధ్యక్షుడు భాస్కర్గౌడ్, తిమ్మాపూర్ ఎంపిటిసి సభ్యుడు నర్సింలుగౌడ్, నాయకులు సాయిలు, ఆంజనేయులు, శ్రీనివాస్, డాక్టర్ శ్రీకాంత్, శ్రీనివాస్గౌడ్, నిరంజన్, మల్లేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.