మహబూబ్‌నగర్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలానగర్, సెప్టెంబర్ 23: బాలానగర్ మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దాంతో ఆయన మృతి చెందాడు. బాలానగర్ మండలం నందారం గ్రామ పంచాయతీ పరిధిలోని మచారం తాండకు చెందిన తులసీనాయక్(33)ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన అక్కడిక్కకడే మృతి చెందాడు. బాలానగర్‌లో జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండా అతివేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. డీకొట్టిన వాహనం అక్కడ నిలవకుండా మరింత వేగవంతో వెళ్లిపోయింది. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. వెంటనే బాలానగర్ ఎస్సై ఆశోక్‌కుమార్‌తో పాటు వారి సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఈ మేరకు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎసై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.