Others

నిజ జీవిత గమనం.. గణితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామానుజన్ జయంతి సందర్భంగా
*
మానవుల నిజజీవితంలో సున్నా కనుగొన్నప్పటి నుండి గణిత గమనం చక్రం కన్నా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. నిత్యావసర మానవుని మేథో ఆయుధంగా గణితం మారింది. ఈజిష్టియన్లు, సుమేరియన్లు, రోమన్లు ఎందరో ఈ శాస్త్ర అభివృద్ధికి అహర్నిశలు అంకుఠిత దీక్షతో పయనించారు. ఒక శాస్త్రం జీవితంలో ఎలా మమేకమై పోతుందో దానిపై ఆధారపడి మనిషి ప్రయాణం ఎలా ఉంటుందో గణితం ఒక చక్కని ఉదాహరణ.
భారతదేశంలో గణితం అభివృద్ధి ఒక శిల్పి చెక్కిన శిల్పంలా దశలవారీగా కొత్తపుంతలు తొక్కుతూ తన రూపు సంతరించుకుంది. ఇందు లో ఎంతోమంది కృషి ఉన్నప్పటికీ అతి చిన్న వయసులోనే ప్రపంచ దృష్టిని తన వైపు ఆకర్షింప చేసిన తమిళనాడు రాష్ట్రం, ఈ రోడ్డుకు చెందిన శ్రీనివాస రామానుజన్ వారిలో చెప్పదగిన వారు. తన అపూర్వ మేధాసంపత్తితో నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ ప్రతిభకు ఇవేవి అడ్డం కాదని నిరూపించారు.
1887 డిసెంబర్ 22 తమిళనాడులోని ఈరోడ్డులో జన్మించిన రామానుజన్ కుంభకోణం టౌన్‌హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి గవర్నమెంటు కాలేజీలో కొన్ని ఆర్థిక అనారోగ్య కారణాల వల్ల ఎఫ్.ఎ. పూర్తి చేయలేకపోయాడు. గణితం పట్ల ఉన్న ఆసక్తితో విద్యార్హత లేని కారణంగా ఉద్యోగం రాకపోవడం వంటి ప్రతికూల పరిస్థితులలో కూడా వింత చదరాలు, వితత భిన్నాలు,ప్రధాన సంఖ్యలు, పార్టిషన్ ఆఫ్ నెంబర్స్, ఎలిఫ్టిక్ ఇంటి ఇంటిగ్రల్ వంటి అంశాలపై పరిశోదనలు చేశాడు.
శ్రీనివాస రామానుజన్ తన ఫలితాలను పావుటావు నోటు పుస్తకాల పై రాసుకునేవాడు. అది చూసిన ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటి వ్యవస్థాపకుడు ప్రొ. వి. రామస్వామి అయ్యర్ ఆయనకు నెలసరి ఉపకార వేతనం వచ్చేటట్టు చేశాడు. డాక్టర్ వాకర్ ‘‘ఒక ఉన్నత శ్రేణి గణిత శాస్తజ్ఞ్రుడు మాత్రమే రాయగల సూత్రాను ఒక సాధారణ గుమస్తా ప్రతిపాదించటం చూసి ఆశ్చర్య పోయాడు. అదేక్రమంలో తన పరిశోధనలను పరిశీలన నిమిత్తం కేంబ్రిడ్జి ప్రొ.జి.హెచ్.హార్డీకి పంపారు. అది చూసి ఆశ్చర్య పోయిన ఆయన రామానుజన్ ను ఇంగ్లండుకు సాదరంగా ఆహ్వానించాడు. 1914 మార్చిలో ఇంగ్లాండ్ వెళ్లిన రామానుజన్ ఆరేళ్ల కాలంలో 32 పరిశోధనాపత్రాలను సమర్పించి ‘‘ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ’’,‘ఫెలో ఆఫ్ దట్రినిటీ’ కాలేజీ గౌరవాలను పొందిన మొదటి భారతీయుడు అయ్యాడు.
1919 మార్చిలో ఇండియా తిరిగి వచ్చిన ఆయనకు అభిమానులు అన్ని విధాల వైద్య వసతి సదుపాయాలు కల్పించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 1920 ఏప్రిల్ 26న శ్రీనివాస రామానుజం గారు మరణించారు. ఇక్కడ మన గమనించాల్సింది ఆయన కేవలం ఒక గణితశాస్తవ్రేత్త మాత్రమేకాదు. ‘‘మానవ మేధస్సుకు ఏ అడ్డంకులు ఉండవని అది ఏం చేయాలనుకుంటే అది చేసి తీరుతుంది’’ అని నిరూపించిన వ్యక్తి. అప్పట్లో ఆయన సాధించిన ఫలితాలు ‘‘నంబర్ థియరీ’’కి సంబంధించినవి కాబట్టి ప్రస్తుత గణితంలో వాటి ప్రయోజనాలు ఏమీ ఉండవని పెదవి విరిచిన మేధావులు ముక్కున వేలేసుకునేలా ప్రస్తుతం స్ట్రింగ్ థియరీ క్యాన్సర్ పరిశోధనలలో ఉపయోగపడుతున్నాయి. అలాగే మాక్ తీట ఫంక్షన్ విజ్ఞాన శాస్త్ర పరిశోధనలను ప్రభావితం చేస్తున్నాయి.
దేశం ఆయనకు ఇచ్చిన గౌరవం
శ్రీనివాస్ రామానుజన్ గారి స్మారకార్థం ‘‘రామానుజన్ ఇన్సిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్’’ ను 1950 లో అలాగే భారతదేశ ప్రభుత్వం ఒక ‘తపాలబిళ్ల’ను, 1962 డిసెంబర్ 22న విడుదల చేశాయి. ప్రతి ఏటా డిసెంబర్ 22ను భారత పౌరులు ఎల్లపుడు ఆయనను గుర్తుంచుకునే విధంగా గణిత దినోత్సవంగా ప్రకటించారు. అలాగే 125వ జయంతి సందర్భంగా 2012వ సంవత్సరాన్ని గణిత సంవత్సరంగా ప్రకటించింది.
నేటి బాలలు.. గణితం
భారతదేశంలో ఇంతటి పేరు ప్రఖ్యాతులు పొందిన గణిత శాస్తవ్రేత్తలు అనేకమంది ఉన్నప్పటికీ గణిత దినోత్సవాలు జరుగుతున్నప్పటికీ కొన్ని ప్రాథమిక పాఠశాలలో ఇప్పటికీ దాదాపు40 శాతం మంది పిల్లలకు ప్రాణమిక భావనలు రావని తేలడం కొద్దిగా బాధపడవలసిన విషయం. కొద్దిమందిలో పిల్లల్లో గణితం అంటే విపరీతమైన భయం వల్ల వాటి ఆలోచన అందుకోలేకపోతున్నారు. అటువంటి పిల్లల్లో గణితం అంటే భయం ఎందుకు కలిగి ఉన్నారో కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పదవి తరగతి తరువాత ఇంటర్ లో సైన్సు, ఆర్ట్స్ గ్రూపులలోని విద్యార్థులకు గణితం అవసరం లేదన్న భావనను కొన్ని కార్పోరేటు పాఠశాలలు కల్పించడం ఈ దుస్థితికి కారణం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
గణితం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు
నేటి బాలలే రేపటి పౌరులు అన్న నినాదాన్ని నిజం చేయాలంటే భారతదేశాన్ని గణిత పరంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. పిల్లలను అర్థం చేసుకోని వారికి గణితం సులభ రీతిలో బోధించాల్సిన అవసరం ఉంది. బోధనలో మెలకువల వల్ల వారికి గణితం పట్ల ఉత్సాహాన్ని ఆసక్తిని కలిగించేదిశగా టీచర్స్ చర్యలు తీసుకోవాలి.వీరే కాక గణితం పట్ల ఆసక్తిని కలిగించడానికి గణితాభిమానులు కూడా కొన్ని విధానాలు రూపొందించాలి. గణితం కూడా ఒక అభివృద్ధిసూచిక నిర్ణయించుకున్నపుడు మాత్రమే దేశం విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందుతుందని భావించవలసి ఉంటుంది. అందుకు ప్రభుత్వం మరియు ప్రభుత్వేతర సంస్థలు గణితానికి సంబంధించి అవార్డులు మరియు పిల్లలకోసం ప్రత్యేక పోటీ పరీక్షలు నిర్వహించడం ద్వారా మానసికోల్లాసంతోపాటు గణితం పట్ల ఉన్నభయాన్ని దూరం చేసి మానసికోల్లాసాన్ని కలిగించే వారవుతారు.

- సింగంపల్లి శేషసాయి కుమార్ 8639635907