Others

ప్రకృతి రక్షణే పరమాత్ముని పూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడు సృష్టించిన ఈ చరాచర జగత్తంతయు ప్రకృతే. ఫంచ భూతాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, నదులు, పర్వతాలు, సముద్రాలు అరణ్యాలు, అందులో జీవ జంతువులు అన్నియూ ప్రకృతిలోని భాగాలే. ఈ సృష్టి సమతుల్యాన్ని కాపాడే చెట్లు, గుట్టలు, అరణ్యాలు, పర్వతాలు అన్నీ మానవుని మనుగడ సాగించడానికి అవసరమైనవే. కనుక వాటి అన్నింటితోను కలసి ఉన్న ప్రకృతిని మనిషి తన స్వార్థం కోసం నాశనం చేయకూడదు. వాటి అన్నింటినీ సమతౌల్యంతో కాపాడుకోవాల్సిన బాధ్యత మానవుని పైనే ఉంటుంది.
మానవుడు అవసరాలన్నింటినీ ప్రకృతినే తీరుస్తున్నది. కేవలం భౌతికావసరాలే కాక ఆధ్యాత్మికపథంలో నడవడానికి కూడా ప్రకృతి ఎంతో ఉపయుక్తంగానే ఉంటుంది. ప్రకృతిని అర్థం చేసుకొన్న మనిషి ప్రకృతి పైన విజయం సాధించగలడు. ప్రకృతి పైన విజయం అంటే పరమాత్మకు జీవాత్మకు భేదం లేకపోవడమే. జీవాత్మ పరమాత్మగా మారడమే.
సాధారణంగా ప్రకృతి ప్రసాదించిన ఆకులు, పూలు, పండ్లు, కందమూలాలు, దుంపలు మానవునికే కాకుండా అనేక జీవరాసులకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. ప్రతి మనిషికి కూడు, గుడ్డ, నీడ ముఖ్యవసరాలు. ఈ మూడు కూడా ప్రకృతి నుండి లభించేవే. మానవుడు తన ప్రజ్ఞ, బుద్ధిబలంతో చెట్లతో సౌధాలను, చెట్ల నారను పట్టు వస్త్రాలుగా కాయలు, పండ్లను ఆహారంగా మార్చుకున్నాడు. అయితే సృష్టి ప్రారంభమునుండి ప్రతి విషయంలో ఎన్నో మార్పులు కనబడుతున్నాయి. మానవుని మేధస్సులో కలిగే సంచలనం ప్రకృతిలో ప్రతిబింబిస్తున్నది. మానవుని ప్రజ్ఞా ప్రాభవాలు వినీలాకాశంలో స్వేచ్ఛగా పక్షుల్లాగా విహరింపజేస్తున్నాయి. ప్రకృతిని చూసి మనిషి పురోభివృద్ధి సాధిస్తున్నాడు. అయతే ఆ పురోభివృద్ధి ప్రకృతికి ప్రమాదకరంగా మారుతోం ది. దానివల్లే ఎన్నో అవాంతరాలు, ఆటంకాలు ఏర్పడుతున్నాయ. ప్రకృతి వికృతిగా మారి మనిషిని అథః పాతాళానికి తొక్కివేస్తున్నది. కనుక సాంకేతికంగా మానవుడు ప్రగతి పథంలో ఎంత అభివృద్ధిని సాధించినప్పటికిని దీని ప్రభావంతో ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యతను పెంచుకోవాలే కానీ దెబ్బతీసేవిధంగా ఉండకూ డదనే సత్యాన్ని విస్మరించకూడదు.
ప్రకృతికి మూలాధారాలైనవి చెట్లు. చెట్లు త్యాగానికి ప్రతిరూపాలు. మనం వాటికి హాని చేసినా అవి మనకు ఎంతో మేలు చేస్తున్నాయి. అందుకే కబీరు- మనం ఇక్కడినుండి రాళ్ళతో కొడితే అవి మనకు అక్కడినుండి ఫలాలనందిస్తున్నాయి. మనకు అవసరమైన ప్రాణవాయువును, ఆకులు, పళ్ళు, కలప ఎన్నో ఇస్తూ ఎంతో మేలు చేస్తున్నాయి. మర్రి, రావి, మేడి, వేప, జమ్మి, ఉసిరిచెట్లను పూజించే ఆచారం హిందువులు ఇప్పటికీ పాటిస్తున్నారు. చెట్లకు ప్రాణశక్తి ఉన్నందువల్ల వాటికి కూడా సుఖ దుఃఖాలున్నవని జగదీశ చంద్రబోసు నిరూపించి ప్రతిష్ఠాత్మకమైన ‘నోబుల్’ బహుమతి పొందాడు. ముఖ్యంగా వృక్షాలకు స్పర్శజ్ఞానం, రసేంద్రియాశక్తి, ఘ్రాణాశక్తి ఉందని నిరూపించారు. సాధారణంగా సామాన్య మానవులకుండే లక్షణాలన్నియు చెట్లకూఉన్నాయి. చెట్లు ప్రకృతిని కాపాడుతాయి. పిడుగులను ఆకర్షించే శక్తి చెట్లకున్నది. చెట్లు దైవీ శక్తులను కలిగి ఉన్నాయి. అవి పిలిస్తే పలికే దైవాలు.
కనుక ప్రతి మనిషి కనీసం ఒక చెట్టు నైనా నాటాలి. ఉన్న చెట్లను కాపాడుకోవాలి, చెట్లను విస్మరిస్తే ప్రకృతిని పక్కనబెట్టినట్టు అవుతుంది. అపుడే ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడుతాయ. ‘వృక్షో రక్షతి రక్షితః’ అని పెద్దలు చెప్పిన మాటను మనం ఆలకిద్దాం. ఆచరిద్దాం. మనం ప్రకృని కాపాడితే ప్రకృతి మనలను కన్నబిడ్డలా పరిరక్షిస్తుంది. ప్రకృతిని రక్షించు ప్రకృతిలో జీవించు. ప్రకృతిని కల్మషం చేయకుండా ఈశ్వరత సర్వభూతానాం అని తెలిసి కొని భగవంతుడు అన్నింటా వ్యాపించి యున్నాడని అన్ని ప్రాణుల యెడ భూతదయ కలిగి రక్షించుట మానవ ధర్మం. స్వధర్మాన్ని కాపాడిన వారిని భగవంతుడు తప్పక రక్షిస్తాడు.

- చోడిశెట్టి శ్రీనివాసరావు