Others

ముక్కోటి ఏకాదశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిమాసంలో రెండు చొప్పున 24 లేక 26 ఏకాదశులు సంవత్సరంలో వస్తాయ. వాటిల్లో ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి పవిత్రమైనా అత్యంత పవిత్రమైన ఏకాదశుల్లో పుష్యశుద్ధ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా ప్రాచుర్యం పొందింది. ఏకాదశి విష్ణు వరప్రసాది. ఈ రోజున చేసే కార్యాలన్నీ విష్ణుప్రీత్యర్థం చేస్తే వేలకోట్ల పుణ్యరాశులు సొంతం అవుతాయ. వైకుంఠద్వారంలో మహావిష్ణువు దర్శనార్ధం ముక్కోటిమంది దేవీ దేవతలు వసారని దేవాలయ వైకుంఠ ద్వారం దగ్గర మానవులూ మహావిష్ణువు దర్శనార్థమై నిలుబడుతారు.
విష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది తులసని తులసీమాలలతో విష్ణువును అలంకరిస్తారు. జాజిపూల ప్రియుడని తలచి మహావిష్ణువుకు సుమధుర భరితమైన జాజిపూలతోను అలంకరణకూడా చేస్తారు. తిరుపతిలో కలియుగదైవమైన్ర శియఃపతికి, భద్రాదిలో సీతారాముడికి, శ్రీరంగంలో రుక్మిణీసహిత పాండురంగడితోపాటు గా ప్రతి వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారదర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. విల్లిపుత్తూరు లోని ఆండాళ్ అమ్మవారి ఆలయంలోను ప్రత్యేక పూజలు చేస్తారు. మురాసురసంహారం చేసిన మహావిష్ణువు పేర విష్ణ్భుక్తులు ఉపవాసం చేస్తారు. ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం చేసి విష్ణుకథలను వినడం ఆచారంగా వస్తోంది. ఏకాదశీ ప్రాముఖ్యాన్ని పరమ శివుడు పార్వతీ దేవికి వివరించాడని పద్మ పురాణం చెప్తుంది. భద్రావతీ రాజ్యాన్ని పరిపాలించే సుకేతుడు, ఆయన భార్య చంపక పుణ్యదంపతులు. వీరికి సంతాన భాగ్యం లేక, అనేక పుణ్యక్షేత్రాలను, తీర్థాలను దర్శించి సేవించారు. వారు ఋషివరేణ్యులను ఆశ్రయించి, ఏ నోము, ఏ వ్రతము ఆచరిస్తే సంతానయోగం కలుగుతుందో చెప్పుమని వేడుకుంటే వారు ఈ ముక్కోటి ఏకాదశీవ్రతాన్ని ఆచరిస్తే, తప్పకుండా పుత్రులు కలుగుతారని చెప్పగా, రాజ్యానికి తిరిగి వచ్చి, ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరించారు. లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి వారి కరుణతో పుత్రుడిని పొందారు. అందుకే దీనికి ‘పుత్రైకాదశి’ అంటారు.
ఈ ఏకాదశిని ‘మోక్షైకాదశి’ అనీ, ‘హరివాసరం’, ‘హరిదినం’ అనీ కూడా పేర్లు పెట్టారు. ఈ ఏకాదశీవ్రతాచరణ మూడు కోట్ల ఏకాదశీ వ్రతాలతో సమానమని పురాణాలు చెప్తున్నాయ. ఈరోజున ఉపవాసం చేసి మరునాడు ద్వాదశి ఘడియల్లో ‘పారణ’ చేసి వ్రతాన్ని ముగించటం ఆచారం. ఆ తరువాత శక్తికొలది ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలతో సత్కరించడమూ సంప్రదాయమే.
ఈ రోజున చేసే దానాలు విశేషపుణ్యఫలాన్ని ఇస్తాయని అంటారు.
మనలో ఉన్న అజ్ఞానమనే తలుపులను మూసివేసి జ్ఞానమనే తలుపును తెరిచి పరబ్రహ్మను దర్శనం చేసుకోవాలన్నది ఈ వైకుంఠ ఏకాదశిలోని అంతరార్థం. విష్ణుచిత్తుని కుమార్తె గోదా ఆలపించిన తిరుప్పావై పాశురాలతో నిత్యసంతోషిగా ఉన్న స్వామిని పెళ్లికొడుకుగా భావించి వివిధ పుష్పాలతో పూజచేస్తారు.

- ఆర్. ఎల్ .మూర్తి