ప్రకాశం

మట్కారాయుళ్లపై పోలీసుల పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, మే 17: మార్కాపురం సర్కిల్ పరిధిలో మట్కారాయుళ్లపై పోలీసులు పంజా విసిరారు. మంగళవారం వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి మట్కా ఆడుతున్న 8మందిని అరెస్టు చేసి వారి నుంచి 4700 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు మార్కాపురం సిఐ బత్తుల శ్రీనివాసరావు వెల్లడించారు. మంగళవారం రాత్రి పట్టణ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణ పరిధిలోని జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోగల మున్సిపల్ వాటర్‌ట్యాంక్ వద్ద మట్కా ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పట్టణ ఎస్సై సుబ్బారావు సిబ్బందితో దాడిచేసి ఆరుమందిని అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుంచి 3200 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అరెస్టు చేసిన వారిలో అంగం చిన్ననాగిశెట్టి, చటికల కిశోర్, షేక్ వౌలాలి, కనిగిరి కొండలు, షేక్ బాషా, కందగట్ల కేశవరావులు ఉన్నారు. మార్కాపురం రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలో కోమటికుంట వద్ద రూరల్ ఎస్సై బత్తుల వెంకటేశ్వరరావు తనిఖీలు చేస్తున్న సమయంలో యజ్ఞం వెంకటనారాయణ, కంచర్ల శేఖర్‌లు మట్కా ఆడుతున్నట్లు సమాచారం రావడంతో వారిని విచారించి అదుపులోనికి తీసుకొని వారి వద్ద 1500 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ బత్తుల శ్రీనివాసరావు తెలిపారు. మట్కా జూదరులపై ఉక్కుపాదం మోపుతామని, ఎక్కడైనా మట్కా జరుగుతున్నట్లు సమాచారం అందితే వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. మట్కా జరుగుతున్న విషయాన్ని 9440627104 లేదా 9440627105లకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్సై సుబ్బారావు, రూరల్ ఎస్సై వెంకటేశ్వరరావు, ఐడిపార్టీ సిబ్బంది పాల్గొన్నారు.