ప్రకాశం

తెల్లారేసరికి కాజేశారు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముండ్లమూరు, మే 17 : అందరూ హాయిగా ఆరుబయట నిద్రించారు.. దొంగలు కూడా గుట్టుచప్పుడు కాకుండా తమ పని కానిచ్చేశారు. ఓ ఇంట్లో దొంగలు పడి ఐదులక్షల మేర వస్తువులు, నగదును దోచుకెళ్ళిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మండలంలోని శంకరాపురం గ్రామంలో మేడికొండ శివశంకర్‌రావు ఇంట్లో సుమారు మూడు లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాలు, రెండు లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. ఇంటివెనుక వైపు ఉన్న గదికి గల కిటికిలో గుండా దోమతెర కర్రను పెట్టి గడియను తీసి బెడ్‌రూములోకి ప్రవేశించి బీరువా తాళాలు తీసుకొని అందులోని నగదు, ఆరు సవర్ల బంగారు ఆభరణాలను, 300 గ్రాముల వెండివస్తువులను దొంగలు దోచుకెళ్లారు. వీటి విలువ సుమారు ఐదులక్షలు ఉంటుందని బాధితులు శంకర్‌రావు వాపోయారు. బాధితుడు శంకర్‌రావుతన కుటుంబసభ్యులతో ఆరుబయట నిద్రిస్తున్నారు. ఉదయం లేచి చూసేసరికి దొంగతనం జరిగిన తీరునుగమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలాన్ని దర్శి డిఎస్‌పి శ్రీరాంబాబు, సిఐలు కెవి రాఘవేంద్ర, క్లూస్ టీం సి ఐ రాజు, ముండ్లమూరు ఇన్‌చార్జి ఎస్‌ఐ పి మహేష్ పరిశీలించి బాధితుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేగ్రామానికి చెందిన గోళ్ళ రవికుమార్‌కు చెందిన పల్సర్ వాహనం కూడా చోరీకి గురైంది. ఈ విషయంపై కూడా కేసు విచారణ చేశారు. శంకర్‌రావు, రవికుమార్ ఫిర్యాదుల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్‌పి తెలిపారు.