ప్రకాశం

చీమకుర్తి హరిహర క్షేత్రంలో మంత్రి శిద్దా దంపతుల పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీమకుర్తి, నవంబర్ 19 : కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా చీమకుర్తి హరిహర క్షేత్రంలో రాష్ట్ర అటవీశాఖా మంత్రి శిద్దా రాఘవరావు ఆయన సతీమణి శిద్దా లక్ష్మీ పద్మావతి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరిహర క్షేత్రంలో కొలువైన సకల దేవతలకు విశేష పూజలు, విఘ్నేశ్వరుని గంగా పూజ, అయ్యప్ప స్వామికి మహన్యాసక పూర్వక రుద్రాభిషేకాలు, పంచామృత అభిషేకాలు చేశారు. శిద్దా వెంకటేశ్వర్లు, వెంకట సుబ్బమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో సర్వదీక్ష స్వాములకు అన్నదాన వితరణ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ప్రముఖ వేద పండితులు నేలబొట్ల రామకృష్ణ శాస్ర్తీ, హరిహర క్షేత్ర ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ మేనేజర్ అద్దంకి రామచంద్రమూర్తి కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో శిద్దా సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.