ప్రకాశం

ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్,జూలై 19:గురుపౌర్ణమి వేడుకలను మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలోని సాయిబాబా మందిరాలు భక్తులతో పోటెత్తాయి. లాయరుపేటలోని సాయిబాబా మందిరంలో స్వామివారికి ఉదయం వేళ పంచామృతాభిషేకాలు నిర్వహించి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం స్వామివారి పాదస్పర్శదర్శన భాగ్యాన్ని ప్రజలకు కలిగించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అన్న సంతర్పణ కార్యక్రమాన్ని రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు ప్రారంభించారు. అనంతరం మంత్రి శిద్దాకు ఆలయ వేదపండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికి సత్కరించారు. అనంతరం సాయినాథుని సన్నిధిలో మంత్రి శిద్దా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంతపేట సాయిబాబా మందిరానికి ప్రత్యేకమైన అలంకరణ చేశారు. స్వామివారికి ఉదయం వేళ పంచామృతాభిషేకాలు, మధ్యాహ్నం హారతులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ప్రత్యేక వేదికపై సాయివిగ్రహాన్ని ఏర్పాటుచేసి ప్రజలు పూజలు చేసుకునే ఏర్పాట్లు చేపట్టారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ సతీమణి దామచర్ల నాగసత్యలత ప్రారంభించారు. అదేవిధంగా కర్నూలురోడ్డులోని గాయత్రినగర్‌లో వేంచేసి ఉన్న సాయిబాబా మందిరంలో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన సాయినామ సంకీర్తనల కార్యక్రమాలు అందరిని అలరించాయి.