ప్రకాశం
ప్రైవేట్ బస్సు బోల్తా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 26 September 2016
సంతనూతలపాడు, సెప్టెంబర్ 25 : సంతనూతలపాడులోని మైనంపాడు డొంక సమీపంలోని అనంతపురం నుండి విజయవాడకు వెళుతున్న ప్రైవేట్ బస్సు ఆదివారం ఉదయం బోల్తాపడిన ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. అనంతపురం నుండి విజయవాడ వైపు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నూతలపాడు చెరువు సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించే ప్రయత్నంలో మార్జిన్లోకి రావడంతో బస్సు పక్కకు ఒరిగి బోల్తా పడింది. ఈ సంఘటనలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. సంఘటన విషయం తెలుసుకున్న ఎస్ఐ బాషా సంఘటనాస్థలానికి చేరుకుని 108 ద్వారా క్షతగాత్రులను ఒంగోలుకు తరలించారు. బస్సు బోల్తా కొట్టిన స్థలంలో విద్యుత్స్తంభం ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.