ప్రకాశం

నూతన సంవత్సరంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, డిసెంబర్ 31: నూతన సంవత్సరంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. 2016లో ప్రజలు తీవ్ర కరవు కాటకాలతో అలమటించారని, నూతన సంవత్సరంలో కరవుతీరా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి నియోజకవర్గ ప్రజలు నూతన సంవత్సరంలో సుఖశాంతులతో వర్థిల్లాలని కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మార్కాపురం మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ రాధిక మల్లికార్జున్ పట్టణ ప్రజలు నూతన సంవత్సరంలో శాంతిసుఖాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యే కెపి కొండారెడ్డి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
శుభాకాంక్షలు తెలిపిన జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబ
ఒంగోలు, డిసెంబర్ 31: జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు శనివారం ఒక ప్రకటనలో జిల్లా ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరు పనిపాటలతో, పాడి పంటలతో , దన ధాన్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ శాంతులతో, ఆనందోత్సాహాలతో కళకళలాడుతూ కలకాలం విలసిల్లాలని ఆకాంక్షిస్తున్నట్లు ఈదర హరిబాబు తెలిపారు.
శుభాకాంక్షలు తెలిపిన ఎస్‌పి త్రివిక్రమవర్మ
జిల్లా ఎస్‌పి త్రివిక్రమవర్మ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2017 నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
శుభాకాంక్షలు తెలిపిన కమిషనర్
నగర ప్రజలకు ఒంగోలు కార్పోరేషన్ కమీషనర్ ఎస్ వెంకటకృష్ణ ఒంగోలు నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కమిషనర్ తెలిపారు.