తెలంగాణ
గిరిజనులపై దాడులకు నిరసనగా ఆందోళన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 21 September 2017
హైదరాబాద్, సెప్టెంబర్ 20: రాష్ట్రంలో ఆదివాసులు, గిరిజనులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా, నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన బాట చేపట్టనున్నట్లు టి.కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాలన దుర్మార్గంగా ఉందని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. భూపాల్పల్లి జిల్లాలో ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూముల నుంచి పోలీసులు అమానుషంగా దాడి చేసి ఖాళీ చేయించారని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని గవర్నర్ నరసింహన్ను కలిసి వివరిస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ కోరినా ఇప్పిటి వరకు ఇవ్వలేదని అన్నారు.