విజయనగరం

కొత్తపాలెంలో రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, ఏప్రిల్ 8: మండలంలోని కొత్తపాలెం గ్రామంలో ఈ నెల 9 నుండి 11వ తేదీ వరకు మూడవ రాష్టస్థ్రాయి నాటకోత్సవాలు నిర్వహిస్తామని రసజ్ఞ సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వేమలి త్రినాథరావు తెలిపారు. శుక్రవారం ఇక్కడ నాటకోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 9వ తేదీ రాత్రి 7గంటలకు కరీంనగర్ చైతన్య కళాభారతి వారిచే దొంగలు అనే సాంఘిక నాటిక, అనంతపురం జిల్లా ఉరవకొండ వారిచే చివరి గుడిసె అనే సాంఘిక ప్రదర్శన, 10వ తేదీ రాత్రి 7గంటలకు విశాఖకు చెందిన బహురూప నట సమాఖ్య వారిచే చివరి అధ్యాయం అనే సాంఘిక నాటిక రసజ్ఞ సాంస్కృతిక సేవా సంస్థ విజయనగరం వారిచే దెయ్యాల ఆత్మకథ సాంఘిక నాటికలతోపాటు అర్థరాత్రి ఉదయగిరి కళా సేవా సమితి విజయనగరం వారిచే ఆది అవతారం సాంఘిక నాటికలు ప్రదర్శించబడతాయని తెలిపారు. 11వ తేదీ సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా వారిచే తప్పులెన్నువారు బాలల సాంఘిక నాటిక, మూర్తి కల్చరల్ అసోసియేషన్ కాకినాడ వారిచే పారిశుద్ధ్య భారతం సాంఘిక నాటిక, ఒంగోలు వారిచే నిర్ణయం అనే సాంఘిక నాటిక నిర్వహిస్తామని తెలిపారు. ఈ నాటకోత్సవాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.