విజయనగరం

జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు స్ఫూర్తిదాయకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), ఫిబ్రవరి 10: రాష్ట్ర ప్రభుత్వం ఎంతోప్రతిష్టాత్మకంగా రాజధానిలో నిర్వహిస్తున్న జాతీయమహిళా పార్లమెంటు సదస్సు స్ఫూర్తిదాయకంగా ఉందని ఈ సదస్సుకు హాజరైన జడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె విజయవాడ నుండి ఆంధ్రభూమి విలేఖరితో మాట్లాడుతూ దేశ విదేశాలకు చెందిన వివిధ రంగాల్లో నిష్ణాతులైన మహిళలతో పాటు తానుకూడా ఈ సదస్సుకు హాజరవడం ఎంతో స్ఫూర్తి నిచ్చిందని అన్నారు. ఈసందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రి అశోక్‌గజపతిరాజు, శాసనమండలి చైర్మన్ చక్రపాణిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సదస్సుకు హాజరైన వారిలో ఎమ్మెల్సీ సంధ్యారాణి, ఎస్ కోట, విజయనగరం శాసనసభ్యులు కోళ్లలలితకుమారి, మీసాలగీత తదితరులు ఉన్నారు.