విజయనగరం

గ్రామాల అభివృద్ధికి ప్రధాని మోదీ కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), ఏప్రిల్ 15: గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని మంత్రి మాణిక్యాలరావు అన్నారు. శుక్రవారం జిల్లా బిజెపి కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోఅంబేద్కర్‌ను విస్మరించారని ఆరోపించారు. ఆయన పుట్టిన ఊరు కూడా ప్రజలకు తెలియదని అన్నారు. ప్రధాన మోదీ లండన్ పర్యటనలో అంబేద్కర్ నివసించిన ప్రదేశాన్ని మహారాష్ట్ర ప్రభుత్వంచే కొనుగోలు చేయించారని, ముంబయిలోని హిందూ పాల్ కాంపౌండ్‌లో అంబేద్కర్ స్మారకాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఢిల్లీ పార్లమెంటు సమీపంలో నాలుగు ఎకరాల స్థలంలో వంద కోట్ల రూపాయలతో అంబేద్కర్ స్మారకాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ నెలాఖరు వరకు పార్టీ అధ్వర్యంలో గ్రామ కిసాన్ సభలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పెద్దింటి జగన్మోహనరావు, మాజీ అధ్యక్షుడు శివప్రసాదరెడ్డి, పార్టీ నాయకులు రఘురాజు, సన్యాసిరాజు, జయరాజు, గోపాలరాజు, అశోక్, ముద్దాడమధు తదితరులు పాల్గొన్నారు.