విజయనగరం

ఇంటినెంబర్ల సర్వే వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఏప్రిల్ 15: పట్టణంలో ఇంటినెంబర్ల సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాకలెక్టర్ ఉత్తర్వులను అనుసరించి ఈ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని అన్నారు. ఇంటినెంబర్ల సర్వేకు సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారి వి.రాజేశ్వరరావు, టౌన్ సర్వేయర్ పి.శ్రీనివాసరావుతో సమీక్షించారు. అన్ని వార్డులలోను ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టాలని, ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. దీనిపై టౌన్ ప్లానింగ్ అధికారి రాజేశ్వరరావుమాట్లాడుతూ పట్టణంలో ఇంటినెంబర్ల సర్వే కోసం పది ప్రత్యేక బృందాలను నియమించామని తెలిపారు. రెవెన్యూ వార్డుల వారీగా ఇంటినెంబర్ల సర్వే చేపడుతున్నామని, ఈనెలాఖరు నాటికీ సర్వే పూర్తి చేస్తామని చెప్పారు. ఇంటినెంబర్ల సర్వే పూర్తయిన తర్వాత వీధిపేర్ల బోర్డులను కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు