విజయనగరం

మూఢనమ్మకాలు నిర్మూలించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శృంగవరపుకోట, జూన్ 3: మూఢనమ్మకాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత నాస్తిక్ సమాజం మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శీరాపుశ్రీనివాసరావు గురువారం రాత్రి విశాఖ ఎంపి కంభంపాటి హరిబాబుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ఏడాది జనవరి 12న మక్కువ మండలం సిబిల్లి పెద్దవలస పంచాయితీ పరిధిలో కొత్తకాముడివలస గ్రామంలోచేతబడి నెపంతో గొల్లూరు పండు, సీతమ్మను కొట్టిచంపి మృతదేహాలను గెడ్డ ఒడ్డున దహనం చేసారని పేర్కొన్నారు. గుప్త నిధుల కోసం నరబలులు చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. తక్షణమే భూతవైద్యులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర మాదిరిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోను మూఢనమ్మకాల నిరోధక చట్టంచేయాలని కోరారు.