విజయనగరం

ప్రజలను దోచుకుంటున్న టిడిపి నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 19: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నుంచి సామాన్య కార్యకర్త వరకు దోచుకోవడం..దాచుకోవడం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన గడపగడపకు వై ఎస్సార్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలోని కె.ఎల్.పురంలో పార్టీ నాయకులు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వంద ప్రశ్నలతో పార్టీ రూపొందించిన ప్రజా బ్యాలెట్‌ను ఇంటింటికి పంపిణీ చేసారు. కోలగట్ల మాట్లాడుతూ రెండేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని చెప్పారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి మోసంచేసిన చంద్రబాబునాయుడు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. రాజధాని నిర్మాణం పేర్లతో చంద్రబాబు చెబుతున్న మాయమాటలను ప్రజలు నమ్మవద్దని అన్నారు. పార్టీ నాయకులు పైడిరాజు, రాంబాబు, నారాయణరావు, బుద్దాన అప్పారావు, బంగారునాయుడు పాల్గొన్నారు.