విజయనగరం
మహిళా కమిషన్ సభ్యురాలిగా శ్రీవాణి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 20 July 2016
విజయనగరం, జూలై 19: రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా తెలుగుదేశం నాయకురాలు కొయ్యాన శ్రీవాణి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను స్ర్తి, శిశు సంక్షేమ శాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ రాబర్ట్స్ మంగళవారం శ్రీవాణికి చీపురుపల్లిలో అందజేసారు. పార్వతీపురం నియోజకవర్గ పరిధిలో స్ర్తి, శిశుసంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిన ఆమె గత ఎన్నికలలో పార్వతీపురంనియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ టికెట్ ఆశించి విఫలమయ్యారు. ఆ తరువాత శ్రీవాణి టిడిపిలో చేరారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్కు పూర్తిస్థాయి పాలకవర్గాన్ని నియమించన సందర్భంలో శ్రీవాణికి కమిషన్ సభ్యురాలుగా అవకాశం కల్పించారు.