విజయనగరం

ప్రత్యేక హోదాతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, జూలై 31: ప్రత్యేక హోదాతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమని సిపి ఎం డివిజన్ కార్యదర్శి పురం అప్పారావు అన్నారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోరుతూ ఈనెల 2వ తేదీన రాష్ట్ర బం ద్‌కు పిలుపునిచ్చామని చెప్పారు. ఉత్తరాంధ్ర అన్ని రంగాలలోనూ పూర్తిగా వెనుకబడి ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ప్రజలు తీవ్రంగా నష్టపోవడం ఖాయమని అన్నారు. తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతాపార్టీతో తెగతెంపులు చేసుకొని ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేస్తే ప్రజలు హర్షిస్తారని చెప్పారు. బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు జగదీష్ పాల్గొన్నారు.