ప్రకాశం

జనం గుండెల్లో వైఎస్‌ఆర్ పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు పార్లమెంటుసభ్యులు వైవి సుబ్బారెడ్డి
త్రిపురాంతకం, డిసెంబర్ 18: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల గుండెల్లో పదిలంగా వున్నారని ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని మూడు గ్రామాలు దత్తత తీసుకొని స్వచ్ఛ భారత్ అనే నినాదంతో గ్రామాలను అభివృద్ధి చేసేందుకు గిద్దలూరు నియోజక వర్గంలోని దద్దవాడ, యర్రగొండపాలెం నియోజక వర్గంలోని గణపవరం, కనిగిరి నియోజక వర్గంలోని సిఎస్‌పురం గ్రామాలను ఎంపిక చేశామని, అందులో భాగంగానే గణపవరం గ్రామానికి విచ్చేసి ఆ గ్రామాన్ని పరిశీలించి ఈ గ్రామానికి ఏ విధంగా ఉపయోగపడాలనే విషయంపై అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు గణపవరం గ్రామానికి వచ్చానన్నారు. ఈ గ్రామంలో రాజశేఖర్‌రెడ్డి రెండు విగ్రహాలను వైవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికల మ్యానిఫెస్టో మార్చారని రాష్ట్రం విడిపోతున్నప్పుడు కేంద్రం ఏవైతే అంశాలను పొందుపరిచారో ఆ అంశాలను సక్రమంగా నిర్వహించకుండా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ రాకుండా ఈ నాయకులు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం శాసనసభ్యులు డేవిడ్‌రాజు, నియోజకవర్గంలోని వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. త్రిపురాంతకం ఎంపిడివో మాణిక్యాలరావు, తహాశీల్దార్ చంద్రలీల, డిప్యూటి డిఎంఅండ్‌హెచ్‌ఓ శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.