-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
హైదరాబాద్, జూన్ 4: టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ మంగళవారం ఎట్టకేలకు సీసీఎస్ పోలీసులు ఎదుట హాజరయ్యారు. కంపెనీ సెక్రటరీ సంతకం పోర్జరీ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాష్ ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సుప్రీం కోర్టు, హైకోర్టును ఆశ్రయించినా ఊరట లభించలేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసుల ఎదుట హాజరయ్యారు.
చెన్నై, జూన్ 3: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించిన కేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిని విడుదల చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై రెండు వారాల్లోగా గవర్నర్ భన్వర్లాల్ పురోహిత్ ఆమోద ముద్ర వేస్తారని ఆశిస్తున్నామని తమిళనాడు ప్రభుత్వం సోమవారం మద్రాసు హైకోర్టుకు తెలిపింది.
ముంబయి, జూన్ 3: మధ్యప్రదేశ్లోని భోపాల్ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్కు ముంబయి ఎన్ఐఏ కోర్టులో చుక్కెదురైంది. 2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆమె ప్రధాని నిందితురాలన్న సంగతి తెలిసిందే. కేసు విచారణకు సంబంధించి ప్రజ్ఞ్ఠాకూర్ ఈ వారంలో ఎన్ఐఏ కోర్టుకు హాజరు కావల్సి ఉంది.
న్యూఢిల్లీ, జూన్ 3: మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రాకు అమెరికా, నెదర్లాండ్ దేశాలకు వెళ్లేందుకు ఢిల్లీ హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ అయిన వాద్రాకు ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ప్రత్యేక జడ్జి అరవింద్కుమార్ అనుమతిచ్చారు. అయితే, ఆయన ప్రయాణ వివరాలను మాత్రం కచ్చితంగా కోర్టుకు సమర్పించి తీరాలని స్పష్టం చేసింది.
నాసిక్, జూన్ 3: మూడో కాన్పులో కూడా ఆడబిడ్డ పుట్టడాన్ని జీర్ణించుకోలేని కసాయి తల్లి తన పది రోజుల ఆడ శిశువును కిరాతకంగా హతమార్చిన వైనమిది. మహారాష్టల్రోని నాసిక్ పరిధిలోని అడగాంలో ఈ సంఘటన శుక్రవారం జరిగినట్లు అధికార వర్గాలు ఆదివారం వెల్లడించాయి. నిందితురాలు అనూజ కాలె (26)కు మూడు కాన్పులోనూ ఆడపిల్ల జన్మించింది.
విజయవాడ (క్రైం), జూన్ 3: పండిట్ నెహ్రూ బస్టేషన్ వద్ద పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. సమాచారం మేరకు కేరళ త్రివేండ్రంకు చెందిన హరికుమార్, కురుత్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు తాము కొనుగోలు చేసిన గంజాయిని ప్రైవేటు బస్సులో తరలించేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు.
పెనమలూరు, జూన్ 3: పోలీస్ అంటూ వచ్చి బెదిరించి డబ్బులు గుంజే ప్రయత్నం ఎవరు చేసినా దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎస్ఐ కుమార్ అన్నారు. పెనమలూరు పోలీస్ స్టేషన్లో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలానికి చెందిన ఒగోలు వీరనారాయణ (42) పోలీస్ అవతారం ఎత్తి కూల్డ్రింక్స్, పాన్ షాపులను లక్ష్యంగా ఎంచుకుని వ్యాపారుల నుండి అందినకాడికి దోచుకున్నాడని తెలిపారు.
జీడిమెట్ల, జూన్ 3: గండిమైసమ్మ చౌరస్తాలో ఉన్న సౌత్ ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలో దొంగలు చోరీకి ప్రయత్నించిన సంఘటన దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రధాన రహదారిలో ఉన్న బ్యాంక్ ఏటీఎం షట్టర్స్ను గుర్తుతెలియని దుండగులు తొలగించే ప్రయత్నం చేశారని బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
జీడిమెట్ల, జూన్ 3: నాలాలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని జీడిమెట్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్లలోని అగ్నిమాపక కేంద్రం ఎదురుగా ఉన్న నాలాలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. మృతుని చేతి వేళ్లు కట్ అయి ఉన్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జీడిమెట్ల, జూన్ 3: దుండిగల్ మండల్ గండిమైసమ్మ గాగిల్లాపూర్లోని సర్వే నెంబర్ 214లో ప్రభుత్వ స్థలంలో నోటరీ డాక్యుమెంట్లను తయారు చేసి పేదలకు విక్రయిస్తున్న 15 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.