S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అలీ సమర్పణలో ఖయూమ్, తనిష్క్, రాజన్, షానీ, పృథ్విరాజ్, సమీర్, లోహిత్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘దేశంలో దొంగలు పడ్డారు’. సారా క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ట్రైలర్ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘దేశంలో దొంగలు పడ్డారు’ ట్రైలర్ నా చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషం.
మెగాస్టార్తో సినిమా చేయాలని ఏ దర్శకుడు అనుకోడు చెప్పండి. అయితే ఇలాంటి అవకాశం కొందరు దర్శకులకు చెప్పకుండా వచ్చేస్తాయి. ఇపుడు అలాంటి క్రేజీ అవకాశాన్ని కొట్టేశాడు దర్శకుడు కొరటాల శివ. మిర్చి, సినిమాతో క్రేజీ దర్శకుడిగా మారిన కొరటాల శివ శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, లేటెస్టుగా భరత్ అనే నేను సినిమాలతో టాలీవుడ్లో టాప్ డైరెక్టర్గా సెటిల్ అయ్యాడు.
పుష్యమి ఫిలిం మేకర్స్, ఎం.జి ఔరా సినిమాస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్లలో బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ నిర్మాతలుగా సెనే్సషనల్ స్టార్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం సామి. సింగం, సింగం 2, సింగం 3, పూజా వంటి సూపర్హిట్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేయించుకున్న హరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.
ప్రముఖ పాపులర్ యాంకర్, నటుడు బిత్తిరి సత్తి కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం తుపాకీ రాముడు. బతుకమ్మ ఫేమ్, సీనియర్ దర్శకులు టి.ప్రభాకర్ దర్శకత్వంలో రసమయి ఫిల్మ్స్ పతాకంపై రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తిచేసుకుని, శరవేగంగా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్, ఫస్ట్లుక్ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఆవిష్కరించారు.
శివ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్పై శివ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘మాస్ పవర్’. వినాయకచవితి సందర్భంగా ఈ చిత్రంలో వినాయకుడుపై రూపొందించిన పాటను ఇటీవల ఫిలిం ఛాంబర్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ప్రసన్నకుమార్ అతిథిగా విచ్చేసి పాటను లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- వరుసగా శివ జొన్నలగడ్డ సినిమాలు చేస్తూ విజయం సాధిస్తూ వస్తున్నారు.
ఆర్ఎక్స్ 100 సినిమా సక్సెస్తో ఓవర్నైట్లో సెనే్సషనల్ హీరోయిన్గా మారిపోయింది పాయల్ రాజ్పుత్. తన బోల్డ్నెస్ గ్లామర్తో కేవలం ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీ చూపును తన వైపునకు తిప్పుకుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ హీరోయిన్ ఓ స్పెషల్ సాంగ్లో నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్-తేజ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోంది.
సుధీర్బాబు, నభా నటేష్ జంటగా సుధీర్బాబు ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎస్.ఆర్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. మొదటిసారి సుధీర్బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 21న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు ఎస్.ఆర్.నాయుడు చెప్పిన విశేషాలు... ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రైలర్ వైరల్గా మారుతోంది.
కేయస్ ప్రొడక్షన్స్ పతాకంపై డా.యలమంచిలి ప్రవీణ్ సమర్పణలో అరుణ్ తేజ్, చరిష్మా శ్రీకర్ జంటగా బియన్రెడ్డి అభినయ దర్శకత్వంలో డా.యలమంచిలి ప్రవీణ్, డా.ఏయస్ కీర్తి, డా.జి.పార్థసారధిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘నీతోనే హాయ్ హాయ్’. ఈ చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్లో హీరో శ్రీకాంత్ చేతులమీదుగా జరిగింది. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘’టైటిల్ చాలా హాయిహాయిగా ఉంది.
పాకిస్థాన్ కథానాయకి వీణామాలిక్ నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రెడ్మిర్చీ’. కన్నడలో తెరకెక్కిన ‘సిల్క్’చిత్రం. కన్నడ సినీ చరిత్రలో కొత్త రికార్డులను నెలల్పి 25 కోట్లు వసూలుచేయడమే కాకుండా, 150 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘రెడ్ మిర్చీ’ పేరుతో పి.వి.యన్ సమర్పణలో నైస్ మూవీస్ సంస్థ అందిస్తోంది. ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యం.జి.యం.
రమ్యకృష్ణ ‘శైలజారెడ్డి’గా మరో అవతారం ఎత్తారు. నాగ చైతన్య, అనుఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
నేడు రమ్యకృష్ణ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆమెతో చిట్చాట్...
* రమ్యకృష్ణగారు ముందుగా మీకు బర్త్డే విషెస్.. పుట్టినరోజు కానుకగా ‘శైలజారెడ్డి అల్లుడు’ మంచి విజయాన్ని సాధించడం ఎలా ఉంది?