S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కార్తికేయ, పాయల్ రాజ్పుత్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో కెసిడబ్ల్యూ బ్యూనర్పై అశోక్రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న చిత్రం ‘ఆర్ఎక్స్ 100’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం నేడు (గురువారం) విడుదలవుతున్న సందర్భంగా హీరో కార్తికేయ చెప్పిన విశేషాలు...
అందాల భామ త్రిష.. ప్రస్తుతం ప్రేమలో పడిందన్న విషయం సోషల్ మీడియాలో ఓ రేంజ్లో హల్చల్ అవుతుంది. ప్రస్తుతం ఓ వ్యక్తితో డీప్ లవ్లో ఉందట. త్వరలోనే పెళ్లి కూడా చేసుకునే ఆలోచనలో ఉన్నదని వార్తలు వస్తున్నాయి. దాదాపు దశాబ్దకాలంగా సౌత్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగువెలిగిన ఈ అమ్మడికి ఈమధ్య క్రేజ్ తగ్గింది. దాంతో పెళ్ళికి సిద్ధమైంది..
అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు కార్తి. తాజాగా ఆయన చినబాబుగా వస్తున్నాడు. పాండీరాజ్ దర్శకత్వంలో తమిళ తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిరియాల రవీందర్ తెలుగు ప్రేక్షకులకు చినబాబు పేరుతో అందిస్తున్నాడు. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా కార్తి చెప్పిన విశేషాలు..
చరణ్తేజ్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో ‘నేను లోకల్’చిత్ర దర్శకుడు త్రినాథ్రావు నక్కిన స్టోరీ, దర్శకత్వ పర్యవేక్షణలో, ప్రముఖ దర్శకుడు మారుతి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ఆయుష్మాన్భవ. సిటిఎఫ్ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తోంది.
కె.వంశీధర్ సమర్పణలో ప్రముఖ మోడల్ మిస్ కర్ణాటక అర్చన మోసాలి ముఖ్య పాత్రలో తోట కృష్ణ దర్శకత్వంలో శ్రీ కృష్ణ శంకర్ ప్రొడక్షన్స్ పతాకంపై కనమర్లపూడి కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘అరుంధతి అమావాస్య’ కె.వింధ్యారాణీ సహ నిర్మాత. ఈనెల 20న దాదాపు వంద థియేటర్లకు పైగా ఈ చిత్రం విడుదల కానుంది.
గోపీచంద్, మెహరీన్ హీరోహీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.చక్రవర్తి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘పంతం’. ఫర్ ఎ కాస్.. ఉప శీర్షిక. ఈ సినిమా ఈనెల 5న విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ మీట్లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ- ‘‘మంచి సినిమా చేశానని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అందరూ చూడాల్సిన సినిమా. సమాజానికి ఇలాంటి సందేశాలు కావాలి.
వెంకటరమణ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో డింపుల్ చోపడే, నటాషాదోషి హీరోయిన్స్గా నటిస్తున్నారు. డింపుల్ చోపడే సునీల్ ‘కృష్ణాష్టమి’ చిత్రంలో నటించింది. అలాగే నటాషాదోషి బాలకృష్ణ ‘జై సింహ’ సినిమాలో నటించింది. సుధీర్రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కొలన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు.
ఎస్.జె.్ఫలింస్ పతాకంపై రూపుదిద్దుకున్న చిత్రం ‘అంతకుమించి’. జై, రష్మీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు సతీష్ గాజుల, ఎ.పద్మనాభరెడ్డి, సహ నిర్మాతలు భానుప్రకాష్ తేళ్ల, కన్నా. హర్రర్ థ్రిల్లర్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి జానీ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు చూడని సరికొత్త పాత్రలో రష్మీని చూడబోతున్నారు.
మారుతి సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్పై ప్రభాకర్ పి.దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు నిర్మిస్తోన్న చిత్రం ‘బ్రాండ్ బాబు’. సుమంత్ శైలేందర్, ఈషారెబ్బా, పూజిత వన్నోడ, మురళీశర్మ ప్రధాన తారాగణంగా నటించారు. ఈ సినిమా టీజర్ను దర్శకుడు హరీశ్శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ- ‘‘నేను తొలిసారి పూర్తిగా మాటలు, స్క్రిప్ట్ అందించిన సినిమా ఇది.
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘వైఫ్ ఆఫ్ రామ్’. విజయ్ యొలకంటి దర్శకుడు. ఈ సినిమా జూలై 20న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ రఘు దీక్షిత్ చెప్పిన విశేషాలు.. నేను ఇదివరకు బాలీవుడ్, కన్నడ సినిమాలకు సంగీతం అందించాను. ‘వైఫ్ ఆఫ్ రామ్’ నా తొలి తెలుగు చిత్రం. ఓ ఫ్రెండ్ ద్వారా దర్శకుడు విజయ్ని కలిశాను. తను సినిమాకు సంగీతం చేయాలని అడగ్గానే ఎన్ని సాంగ్స్ ఉన్నాయని అడిగాను.