S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/05/2018 - 19:56

తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో డిజిటల్ మరియు థియేటర్ల లీజ్ విధానంపై మార్చి 31లోపు డిజిటల్ రేట్లు తగ్గించకున్నా, థియేటర్ల లీజు విధానం తీసివేయకపోయినా ఆ రోజునుండి రెండు రాష్ట్రాలలో సినిమాలు, థియేటర్లు, షూటింగ్‌లు బంద్ చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ తెలిపారు.

01/04/2018 - 20:13

నార్త్‌స్టార్ ఎం టర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నయనతార ప్రధాన పాత్ర లో శరత్‌మరార్ రూపొందించిన చిత్రం ‘ఆరమ్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘కర్తవ్యం’ పేరుతో అనువాదం చేశా రు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్ యూ సర్ట్ఫికెట్ లభించిన ఈ చిత్రానికి గోపీ నైనర్ దర్శకత్వం వహించారు.

01/04/2018 - 20:12

నితిన్ ప్రస్తుతం కృష్ణచైతన్య దర్శకత్వంలో నటిస్తున్నాడు. గుర్తుందా సీతాకాలం అన్న టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముగింపు దశలో వుంది. తాజాగా నితిన్, సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీనివాసకళ్యాణం చిత్రంలో కూడా నటించనున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చినుండి మొదలుకానుంది.

01/04/2018 - 20:11

చిత్రం, జయం, నువ్వు-నేను, సంతోషం, మనసంతా నువ్వే, నువ్వు లేక నేను లేను వంటి చిత్రాలకు సంగీతం అందించిన ఆర్.పి.పట్నాయక్ దర్శక నిర్మాతగా మారి చిత్రాలు రూపొందించిన తరువాత సంగీత దర్శకుడిగా ప్రేక్షకులకు దూరమయ్యాడు. అయితే సంగీత ప్రియులకు ఆర్.పి ఇప్పుడు ‘నీతో ఏదో చెప్పాలి వుంది’ అనే మెలోడీ పాటతో పలకరించాడు. ఈ వీడియో సాంగ్‌ను గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.

01/04/2018 - 20:09

వసంత్‌కుమార్, ఆండ్రియా, అంజలి ప్రధాన తారాగణంగా డి.వి సినీ క్రియేషన్స్ పతాకంపై రామ్ దర్శకత్వంలో డి.వెంకటేష్ అందిస్తున్న చిత్రం ‘తారామణి’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఫిబ్రవరి నెలాఖరున విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ- తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన ఈ చిత్రం నేటి యువత ప్రవర్తనకు అద్దంపట్టేలా వుంటుందని తెలిపారు.

01/04/2018 - 20:07

బాలకృష్ణ సినిమా సినిమాకు వేగం పెంచాడు. ఇప్పటికే 100 సినిమాలు పూర్తిచేసుకున్న ఆయన తన 102వ చిత్రం ‘జె సింహా’ షూటింగ్ కూడా పూర్తిచేశాడు. తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ నేతృత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి.కల్యాణ్ రూపొందించారు.

01/04/2018 - 20:05

ప్రపంచ హితైషు లు భారతీయులు సర్వేజనాసుఖినోభవన్తు అనేది వారి నాదం వేదం.
కనుకనే సర్వజనులు సులక్షణంగా ఉండాలని, సర్వజగత్తు సస్యశ్యామలంగా ఉండాలని వేదం కోరుకోమని చెబుతుంది. వేదాన్ని పరమ ప్రమాణంగా భావించే హైందవులు సర్వజనుల సుభిక్షత కోసం యజ్ఞాలు, యాగాలు చేయడం పూర్వకాలంనుంచీ చేస్తూ వస్తున్నారు.

01/03/2018 - 19:55

తెలుగు, తమిళ భాషల్లోనూ పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ కెరీర్‌లో తిరుగులేని విజయపథంలోకి దూసుకుపోతోంది అందాల భామ కీర్తి సురేష్. పవన్‌కళ్యాణ్ సరసన ఆమె నటించిన ‘అజ్ఞాతవాసి’, సూర్యతో కలిసి చేసిన ‘గ్యాంగ్’ చిత్రాలు ఈ సంక్రాంతికే విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇవేగాక, ప్రస్తుతం ఆమె మరొక క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకుంది.

01/03/2018 - 19:54

అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య’ (నా ఇల్లు ఇండియా) అనే పేరుతో వస్తున్న దేశభక్తి చిత్రం ప్రేక్షకుల అంచనాలను మించి టీజర్ విజయవంతమైంది. కథానాయకుడు కొత్త తరహా లుక్‌తో కనిపిస్తారని, ఈ చిత్రంలోని డైలాగులు కూడా తమ అంచనాలను రెట్టింపు చేశాయని నిర్మాతలు తెలియజేస్తున్నారు.

01/03/2018 - 19:53

స్మైల్ పిక్చర్స్ పతాకంపై రామస్వామి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ అనే పేరును ఖరారు చేశారు. అర్జున్ యజత్, భరత్ భండారి, రామస్వామి కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో సౌమ్యా వేణుగోపాల్, పావని, సీమాచౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Pages