S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రామ్చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటివరకు హైదరాబాద్లో జరిగిన భారీ షెడ్యూల్తో ఈ సినిమా షూటింగ్ పూర్తిచేశా రు. చివరి షెడ్యూల్ రాజమండ్రిలో జరపనున్నారు. ఈ షెడ్యూల్ను ఈ నెల 12 వరకు జరిపి టాకీ పార్ట్ మొత్తం పూర్తిచేయనున్నారు. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం 1985 నేపథ్యంలో ఉంటుంది.
బాలీవుడ్లో బయోపిక్ హవా ఎక్కువ అవుతోంది. కొత్త కథలను వెతికే కంటే కొం దరు గొప్ప వ్యక్తుల జీవిత కథలను తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నారు. ఈ పద్ధతి ఇప్పుడు టాలీవుడ్కు వచ్చింది. తెలుగులో బయోపిక్ చిత్రాలు ఎక్కువగానే తెరకెక్కుతున్నాయి. ఎన్టీఆర్, మహానటి సావిత్రి, పుల్లెల గోపీచంద్ కథలు సినిమాలుగా వస్తున్నాయి.
ధను క్రియేషన్స్ పతాకంపై అల్లం భువన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘సారధి’. నూతన తారలు రేవంత్.జిహెచ్, సమ్మోహిత్, అనితా రాఘవ, తేజారెడ్డి ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 5న విడుదలకు సిద్ధమైన సందర్భంగా పాత్రికేయుల సమావేశం జరిగింది.
మోహన్బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గాయత్రి’. మంచు విష్ణు, శ్రీయ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ను ఇటీవల విడుదల చేశారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా సాగుతూ కుటుంబ కథా చిత్రంగా వుంటుందని దర్శకుడు మదన్ తెలియజేశారు. ఫిబ్రవరి 9న ఈ సినిమాను విడుదల చేయనున్నామని వారు తెలిపారు.
సెల్వరాఘవన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై సూర్య, సాయి పల్లవి జంటగా ఎస్.ఆర్.ప్రభు, ఎస్.ఆర్.ప్రకాష్బాబు రూపొందిస్తున్న ఓ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటీవలే మొదలైంది.
త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో నటుడు రామ్ ఓ చిత్రంలో నటించనున్నారు. ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ సినిమా తరువాత ఆయన నటిస్తున్న చిత్రం ఇదే. ‘నేను లోకల్’ సినిమా తరువాత నక్కిన త్రినాథరావు చేస్తున్న సినిమా కూడా ఇదే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటించనున్నదట. ప్రస్తుతం ఆమె నిఖిల్తో ‘కిరాక్ పార్టీ’ చిత్రంతోపాటుగా విజయ్ దేవరకొండ, పరశురామ్ల చిత్రంలో నటిస్తోంది.
బాహుబలి చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ క్రేజ్ మరింత పెరుగుతోంది. ఆయనతో సినిమా చేయడానికి బాలీవుడ్తో పాటుగా కోలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ చిత్రానికి సంబంధించిన షూటింగ్లో పాల్గొంటున్నాడు. సుజిత్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం తరువాత కృష్ణంరాజు దర్శకత్వంలో ఓ చిత్రంలో కూడా ప్రభాస్ నటించనున్నాడట.
అటు సౌత్ ఇటు నార్త్లో గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ ఈమధ్య ప్రేమలో పడిందన్న వార్త మీడియాలో హల్చల్ చేస్తూనే వుంది. ఇప్పటికే వీరిద్దరి వ్యవహారంపై జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. శృతిహాసన్ మైఖేల్ కోర్సాల్ అనే లండన్ నటుడితో ప్రేమాయణం సాగిస్తోందంటూ వినిపిస్తున్న వార్తల సారాంశం. అతనితో పీకలోతు ప్రేమలో మునిగిపోయిందని, తన కుటుంబానికి కూడా అతన్ని పరిచయం చేసిందని అంటున్నారు.
ధృవ, వెంబ జంటగా వేదాస్ మీడియా, ఎంటర్టైన్మెంట్ పతాకంపై ద్వారక్ రాజా దర్శకత్వంలో శ్యాం దేవభక్తుని రూపొందిస్తున్న చిత్రం ‘హార్ట్బీట్’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని క్లీన్ యు సర్ట్ఫికెట్ పొందింది. సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందిందని దర్శక నిర్మాతలు తెలియజేస్తున్నారు.
‘అల్లుడు శీను’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి చిత్రంతోనే హీరోగా మంచి విజయాన్ని అందుకున్నాడు. భిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ క్రేజ్ తెచ్చుకుంటున్న శ్రీనివాస్ తాజాగా ‘సాక్ష్యం’తో ముందుకొస్తున్నాడు. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే ఎనభై శాతం పైగా షూటింగ్ పూర్తిచేసుకుంది. నేడు సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు