S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కావాలంటే స్టార్ హీరోలతోనే సినిమాలు చేయనక్కర్లేదని సోలోగాకూడా లేడీ సూపర్స్టార్ అనే బిరుదు తెచ్చుకోవచ్చని నిరూపించిన హీరోయిన్ నయనతార. ‘మాయ’, ‘అనామిక’, ప్రస్తుతం ‘డోరా’ వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసిన నయన్ తాజాగా నూతన దర్శకుడు భరత్ కృష్ణమాచారి డైరెక్షన్లో ఒక సినిమాకి సైన్ చేసింది.
‘మంత్ర’ చిత్రంతో మతి తప్పేలా చేసింది ఛార్మి. అయితే ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా అవేవీ అంత కిక్కివ్వలేదు. మంగళ, బుడ్డాహోగా తేరాబాప్, కావ్యాస్ డైరీ చిత్రాలు వచ్చాయి. అటుపై జ్యోతిలక్ష్మిగా ఓ ఊపుఊపాలని ప్రయత్నించినా కమర్షియల్గా వర్కవుట్ కాలేదు. ఈ చిత్రంలో మగాళ్ళను ఆడుకునే వేశ్యగా రెబల్గా కనిపించి మెప్పించిన ఛార్మి ఆతర్వాత కూడా వేశ్య పాత్రలో నటించి ఫెయిలైంది.
ఈ పోర్న్ భామ కోరికలకు అడ్డుఅదుపులేకుండాపోయింది. హాట్ ఐటెం గర్ల్గా ఇమేజ్ తెచ్చుకున్న సన్నీలియోన్ తాజా వ్యాఖ్య సంచలనం రేపింది. బాలీవుడ్లో తన బయోపిక్ సినిమా చేస్తే.. బాలీవుడ్ క్రేజీ భామ విద్యాబాలన్ నటిస్తేనే బాగుంటుందని సలహా ఇస్తోంది.
నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్గా, హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు సమర్పణలో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో శిరీష్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘నేను లోకల్’. ఆటిట్యూడ్ ఈజ్ ఎవిరీథింగ్...అంటూ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం కాకినాడలో నిర్వహించారు. దిల్రాజుతో సహా చిత్ర యూనిట్ సభ్యులు బిగ్ సీడీ, ఆడియో సీడీలను విడుదల చేశారు.
భిన్నమైన సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో శర్వానంద్. రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా వంటి వరుస విజయాల తరువాత ఈ సంక్రాంతికి శతమానం భవతి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా శర్వానంద్ చెప్పిన విశేషాలు..
* ఈ అవకాశం ఎలా..?
- ధరమ్తేజ్ ఈ కథ విని నన్ను సజెస్ట్ చేశాడు. నేను మొదట్లో చేయకూడదని అనుకున్నా. కానీ పాయింట్ విని వెంటనే ఓకె చెప్పేశాను.
పవన్కల్యాణ్, శ్రుతి హాసన్ హీరో హీరోయిన్లుగా నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కిశోర్ పార్థశాని దర్శకత్వంలో శరత్ మరార్ రూపొందిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’. పొల్లాచ్చిలో షూటింగ్ పూర్తిచేశాక తిరిగి హైదరాబాద్లో షూటింగ్ జరుపుతున్నారు.
తెలుగులో నాని సరసన ‘మజ్ను’లో నటించిన అనూ ఇమ్మాన్యుయేల్ తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఆమె తమిళంలో విశాల్ సరసన ‘తుప్పరివాలా’ చేస్తూనే తెలుగులో పవన్కల్యాణ్-త్రివిక్రమ్ల కాంబినేషన్లో మొదలుకానున్న సినిమాకు ఎంపికైంది. విక్రమ్-గౌతమ్ మీనన్ కలయికలో వస్తున్న ‘్ధృవ నచ్ఛిత్తిరం’లో అవకాశం దక్కించుకుంది.
‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ పదేళ్ల తరువాత చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నెం.150’ సినిమా హయ్యస్ట్ గ్రాసర్గా తొలిరోజు వసూళ్లల్లో నెంబర్ వన్గా నిలిచిందని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. తొలిరోజు ఏకంగా 47.7 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించిందని, తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి రోజు 30.5 కోట్లు వసూలు చేసిందని తెలిపారు.
సూపర్స్టార్ కృష్ణ వారసురాలిగా, సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి నటిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న మంజుల తాజాగా దర్శకురాలిగా మారిన విషయం తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా ఆమె ఒక అర్బన్ లవ్స్టోరీని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాకు హీరోయిన్గా ప్రేమమ్తో సౌతిండియన్ సినిమాలో హాట్ టాపిక్గా మారిన సాయి పల్లవి హీరోయిన్గా నటించనున్నారు. ఇప్పటికే ఆమె ఈ సినిమాకు సైన్ చేశారట.
ధృవ సినిమాతో హిట్ అందుకున్న మెగా పవర్స్టార్ రామ్చరణ్ తన తర్వాతి సినిమా సన్నాహాల్లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తదుపరి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ సినిమా సంక్రాంతి తరువాత మొదలు కానుంది. ఇక ఈ సినిమా తరువాత ఇప్పటికే ఇద్దరు దర్శకులు లైన్లో పెట్టాడు చరణ్. అందులో ఒకరు కొరటాల శివ, మరో దర్శకుడు మణిరత్నం.