S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆమధ్య అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్ధు ఫ్రం శ్రీకాకుళం చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులు కొట్టేసింది మంజరి ఫడ్నిస్. ఆ సినిమా తరువాత ఈమెకు తెలుగులో పలు అవకాశాలు వచ్చాయి. అయితే కమర్షియల్గా మాత్రం ఈమె క్రేజ్ను నిలబెట్టలేకపోయాయి. దాంతో అటు కోలీవుడ్లోనూ, ఇటు బాలీవుడ్లోనూ ప్రయత్నాలు చేసింది. అయినా లాభం దక్కలేదు. దాంతో గ్లామర్ డోస్ పెంచాలని ఫిక్స్ అయినట్టుంది.
ధృవ సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్న రామ్చరణ్ నిర్మాతగా కూడా చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం.150’తో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు సినిమాల ఊపుతో జోరుమీదున్న చరణ్, తన తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ ప్రాజెక్టు జనవరి 30న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానున్నట్టు తెలిసింది.
తమిళుల సంప్రదాయ క్రీడ ‘జల్లికట్టు’ను నిషేధించడం సరికాదని టాలీవుడ్ హీరోలు పవన్కల్యాణ్, మహేష్ బాబు తమ మనోభావాలను ఆవిష్కరించారు. ఈ మేరకు ఈ ఇద్దరు అగ్రనటులూ ‘ట్వీట్లు’ చేశారు. తమిళుల జల్లికట్టుకు, తెలుగువారి కోడిపందాల ఆటకు తాను మద్దతు తెలుపుతున్నానని ఆయన తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
టాలీవుడ్లో భారీ చిత్రాలు నిర్మించి తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు నిర్మాత బండ్ల గణేష్. ఈమధ్య సినిమాలకు దూరంగా వున్న ఆయన రీ ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఆంజనేయులు, గబ్బర్సింగ్, గోవిందుడు అందరివాడేలే, బాద్షా, టెంపర్ లాంటి చిత్రాల్ని నిర్మించి మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు గణేశ్. ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని తెలిసింది.
తొమ్మిదేళ్ల గ్యాప్ తరువాత ప్రముఖ నటుడు చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ నటించిన ఖైదీ నెం.150వ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై సక్సెస్ పథంలో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ నటన, డాన్సులు ఆకట్టుకున్నాయని, చిరంజీవి అప్పటికి ఇప్పటికీ మెగాస్టారే అంటూ ఆయనను అభినందించారు ప్రముఖ పారిశ్రామికవేత్త, నిర్మాత, కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి. హైదరాబాద్లో ఆత్మీయ వేడుక పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సౌత్లో సంచలన తారగా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఈమధ్య కేవలం కోలీవుడ్పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. అటు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు ప్రయోగాత్మక సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే డోరా సినిమాలో నటిస్తున్న నయన, మరో రెండు చిత్రాలను లైన్లో పెట్టింది. ఈ విషయం పక్కనపెడితే, తాజాగా నయనతార దగ్గరికి దర్శక నిర్మాతలు వెళ్లడానికి జడుసుకుంటున్నారట.
బాలీవుడ్ గ్లామర్ భామ దీపిక పదుకొనె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీపిక ఇలాంటి సంచలన కామెంట్స్ చేయడం ఏంటా? అని అనుకుంటున్నారు సినీ జనాలు. ఇంతకీ దీపిక అన్న మాటలు ఏంటో తెలుసా? దీపిక ట్రిపుల్ ఎక్స్ సినిమాతో హాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. హాలీవుడ్ స్టార్ హీరో విన్ డీజిల్ సరసన నటించింది. ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్తో దూసుకుపోతోంది.
తన సినిమా టీజర్ విడుదలైన రోజు నుంచి తప్పించుకుని తిరుగుతున్న ‘ద్యావుడా’ సినిమా దర్శకుడు సాయిరామ్ దాసరిని హైదరాబాద్లో పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ‘ద్యావుడా’ టీజర్ను నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన తర్వాత హిందూ మతాభిమానుల నుంచి ఆయనపై ఒత్తిడి పెరిగింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సినిమా తీసిన దర్శకుణ్ణి అరెస్టు చేసి ప్రశ్నించాలని పలు ఆధ్యాత్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.
మనం సినిమాతో మూడు తరాల హీరోలు కలిసి ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేశారు. ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు మరోసారి నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్నారంటూ వార్తలు జోరందుకున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మిస్తాడని, శతమానం భవతి సినిమాతో విజయం అందుకున్న వేగేశ్న సతీష్ దర్శకత్వం వహిస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన నాగార్జున ఆశ్చర్యానికి గురయ్యాడట.
మనోజ్, ప్రగ్యాజైస్వాల్ జంటగా క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎస్.కె.సత్యా దర్శకత్వంలో వరుణ్ అట్లూరి రూపొందిస్తున్న చిత్రం ‘గుంటూరోడు’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి గుమ్మడికాయ కొట్టారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ఇటీవల విడుదలచేసిన ట్రైలర్కు మంచి స్పందన లభిస్తోందని, యాక్షన్, లవ్, ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్రం అనుకున్న విధంగా పూర్తిచేశామని తెలిపారు.