అనంతపురం

గతాన్ని మరచిపోదాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, జూన్ 25 : ‘గతాన్ని మరిచిపోదాం.. ఇప్పుడు ఐక్యంగా పని చేసి పార్టీతోపాటు, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేద్దాం’ అంటూ ఎమ్మెల్యే బాలకృష్ణ అసంతృప్త నేతలను బుజ్జగించారు. ఇందులో భాగంగా మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపిపి, మండల ఉపాధ్యక్షులు, మండల మాజీ కన్వీనర్ తదితర సర్పంచ్‌లు, ఎపీటీసీలు, ముఖ్య నాయకులతో ఆదివారం సాయంత్రం తన నివాసంలో ఎమ్మెల్యే బాలయ్య సమావేశమయ్యారు. ఎంపిపి, జడ్పీటీసీలతో ఏమైనా విభేదాలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని తెలిపారు. మీకందరికీ న్యాయం చేస్తానని, విభేదాలు విడనాడి నియోజకవర్గ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. అలాగే లేపాక్షి మండల అసంతృప్త నాయకులతో కూడా బాలకృష్ణ సమావేశం నిర్వహించారు. వివిధ కారణాల వల్ల గతంలో జరిగిన పొరపాట్లను పట్టించుకోకుండా పార్టీ బలోపేతానికి, నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తె అందరికీ న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. కాగా బాలకృష్ణతో టిడిపి నేత అంబికా లక్ష్మీనారాయణ కూడా ఏకాంతంగా మంతనాలు సాగించి వివిధ అంశాలపై చర్చించారు. ఇకపోతే స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ల లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ నడుమ కొంతకాలంగా మనస్పర్థలు చోటు చేసుకోవడంపై కూడా వారితో సమావేశమై చర్చించారు. పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. బాలకృష్ణను కలిసిన వారిలో చిలమత్తూరు మండలానికి చెందిన శివప్ప, పాపన్న, గౌరీశంకర్, రంగారెడ్డి, లక్ష్మీనారాయణయాదవ్, కొడికొండ యాదవ్, ఓబుళప్ప, వెంకటరెడ్డి, లక్ష్మీనరసప్ప, నంజుండ తదితరులు ఉండగా లేపాక్షి మండలానికి చెందిన కొండూరు మల్లికార్జున, ఆదినారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.