మహబూబ్‌నగర్

రాష్ట్రంలో రక్తపాత రహిత నిశ్శబ్ద విప్లవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్లరూరల్, అక్టోబర్ 14: రాష్ట్రంలో ప్రస్తుతం రక్తపాత రహిత నిశబ్ధ విప్లవం కొనసాగుతుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి అన్నారు. ఆదివారం పాతబజార్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా మల్లురవి మాట్లాడుతూ అవినీతి, అక్రమాలకు మారుపేరుగా నిలిచిన ముఖ్యమంత్రి కెసీఆర్ ఆధ్వర్యంలో నడుస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏకతాటిపైకి వస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక చర్యల వల్ల రాష్ట్రంలో ప్రజలు స్వేచ్చగా బతికే పరిస్థితులు లేకుండాపోయాయని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఏఒక్క హామీని అమలు చేయకుండా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని అన్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ఏకమవుతుంటే ఓర్వజాలని టిఆర్‌ఎస్ నాయకులు వారిని భయాబ్రాంతులకు గురిచేసే చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ నాయకుల బెదిరింపలకు భయపడకూడదని ఎప్పుడు ఏకష్టం వచ్చినా తాను అండగా ఉండి ఆదుకుంటానని, అర్థరాత్రి ఫోన్ చేసినా స్పందిస్తానని మల్లురవి హామీ ఇచ్చారు. ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫేస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాలిక్‌షాకీర్,నిత్యానందం, బాలవర్థన్‌గౌడ్, రేణుక, నందకిషోర్,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.