కలెక్టర్ సుడిగాలి పర్యటన
Published Sunday, 25 September 2016చోడవరం, సెప్టెంబర్ 24: జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్ శనివారం మండలంలో సుడిగాలి పర్యటన జరిపి వరద ధాటికి కొట్టుకుపోయిన అప్రోచ్ రోడ్డు, కల్వర్టులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాఠశాలలను పరిశీలించి అక్కడి పరిస్థితులపై ఆరాతీశారు. ఉపాధ్యాయులు, గ్రామరెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పనితీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గవరవరం, వెంకన్నపాలెం గ్రామాల్లోని పారిశుద్ధ్యం లోపించడం, ఎక్కడికక్కడ చెత్తాచెదారాలు దర్శనమివ్వడం, రోడ్లపై నీరు నిలిచి ఉండటంతో ఆయా సిబ్బంది పనితీరు పట్ల ఆయన అసహనం వ్యక్తం చేసారు.