28వ డివిజన్లో దోమలపై యుద్ధం
Published Sunday, 25 September 2016పాతబస్తీ, సెప్టెంబర్ 24: దోమలపై యుద్ధం - పరిసరాల పరిశుభ్రత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు 28వ డివిజన్ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య ఆధ్వర్యంలో స్థానిక భవానీపురం మోడల్ రైతుబజార్లో శానిటేషన్ సిబ్బందితో కలిసి అక్కడ నిలిచిన వర్షపు నీరు, చెత్త చెదారం శనివారం తొలగించారు. వనం - మనం కార్యక్రమంలో భాగంగా రైతుబజార్ రహదారి వెంట మొక్కలు నాటటం జరిగింది. దోమల నివారణకై స్థానిక హెచ్బి కాలనీ శ్రీ మోహన్లాల్ చంద్ర బాషూ సాబూ మెమోరియల్ మున్సిపల్ స్కూల్ పిల్లలు, ఉపాధ్యాయులతో కలిసి హెచ్బి కాలనీ ప్రాంతంలో నినాదాలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.