ఈ నెలాఖరుకు పుష్కర పనులు పూర్తిచేయాలి
Published Wednesday, 6 July 2016గుంటూరు, జూలై 5: కృష్ణా పుష్కరాలకు సంబంధించిన పనులన్నింటినీ జూలై మాసాంతానికి పూర్తిచేయాలని కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. పనుల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ దండే మాట్లాడుతూ పుష్కర నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం గుంటూరు జిల్లాకు 500 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. ప్రధానంగా ఇరిగేషన్, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, మునిసిపల్ పరిపాలన శాఖల ద్వారా ఈ నిధులను ఖర్చు చేయనున్నామన్నారు. యాత్రికులు పుష్కర స్నానం ఆచరించేందుకు ఇరిగేషన్ శాఖ ద్వారా 107 కోట్ల ఖర్చుతో 80 ఘాట్లు నిర్మిస్తున్నామని చెప్పారు.