సెంటిమెంటుతో కాలం గడుపుతున్న కేసిఆర్ సర్కార్
Published Wednesday, 6 July 2016మేడ్చల్, జూలై 5: కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ సెంటిమెంటును రెచ్చగొడుతూ కేసిఆర్ సర్కార్ కాలం గడుపుతోందని సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి కె.హరిప్రసాద్ విమర్శించారు. మేడ్చల్ సిఐటియు 4వ మహాసభ పట్టణంలోని నవభారత్ ఫంక్షన్ హల్లో మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మాటల గారడీతో ప్రజలను మభ్యపెడుతూ కెసిఆర్ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. నిత్యావసర ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.