గోదా‘వర్రి’
Published Monday, 4 July 2016విశాఖపట్నం, జూలై 3: దేశ, విదేశాల్లో ఉగ్రవాదుల చర్యలు పేట్రేగిపోతున్నాయి. దీంతో ఏ క్షణంలో ఎటువంటి సంఘటనలు తలెత్తుతాయో తెలియక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇటువంటి సంఘటనలు పోలీసు వర్గాలను సైతం కలవరపరుస్తున్నాయి. అందువల్ల ముందస్తు చర్యలతోనే వీటిని సమర్ధవంతంగా ఎదుర్కోగలమనే ఆలోచనతో పటిష్ఠ భద్రతాచర్యలు చేపడుతున్నాయి. ఫలితంగా ఆంధ్ర రాష్ట్రంలో హైఅలెర్ట్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా జన సామర్ధ్యం అధికంగా ఉండే విమానాశ్రయాలు, ముఖ్యమైన రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ బస్కాంప్లెక్స్ల వద్ద పటిష్ఠ భద్రత నిర్వహిస్తున్నారు. వారం రోజులుగా విశాఖ రైల్వేస్టేషన్లో అన్నివిధాలా నిఘాను కట్టుదిట్టడం చేశారు.