హంద్రీనీవా పనులు వేగవంతం చేయండి
Published Monday, 4 July 2016అనంతపురం సిటీ, జూలై 2: జిల్లాను సస్యశ్యామలంగా చేయడానికి హంద్రీనీవా ప్రాజెక్టును పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కోన శశిధర్ అధికారులను, ఏజెన్సీలను ఆదేశించారు. శనివారం స్థానిక రెవిన్యూ భవన్లో హంద్రీనీవా పనులు పురోగతి, భూసేకరణ పనులపై హంద్రీనీవా ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబందించి ప్యాకేజీల వారిగా జరుగుతున్న పనులు, పెండింగ్లో ఉన్న భూసేకరణపై సమీక్షించారు. స్ట్రక్చర్లు, అండర్ టనె్నల్స్, అక్విడెన్సుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.