తూతూ మంత్రంగా విచారణ
Published Saturday, 2 July 2016ఆర్మూర్, జూలై 1: ఆర్మూర్ పట్టణ నడిబొడ్డున హత్యకు గురైన తలారి సత్యం, చేపూర్ రవి కేసులో ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణపై సిఐడి విచారణ తూతూ మంత్రంగా సాగుతోందని జెఎసి నాయకుడు, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాజారాం యాదవ్ ఆరోపించారు. శుక్రవారం ఆర్మూర్లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నో వినతిపత్రాల అనంతరం ఎస్సీ కమిషన్ స్పందించి విచారణకు ఆదేశించిందని, అయితే సిఐడి విచారణపై తమకు నమ్మకం లేదని, ఎమ్మెల్యేకు అనుకూలంగా నివేదికను తయారు చేస్తున్నట్లు తెలుస్తోందని అన్నారు.