భగ్గుమన్న జనగామ
Published Saturday, 2 July 2016వరంగల్/ మహబూబ్నగర్, జూలై 1: దసరానాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో సర్కారు కసరత్తు చేస్తుంటే, ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా జిల్లాలు ఏర్పాటు తగదంటూ నిరసనలు మొదలయ్యాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా కొద్దిరోజులుగా సాగుతున్న నిరసనలు శుక్రవారం హింసాత్మక సంఘటనలుగా మారాయి. వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో మొదలైన ప్రత్యక్ష ఆందోళనలు మిగతా జిల్లాల్లోనూ సెగపెంచి ప్రత్యక్ష కార్యాచరణకు మార్గం వేస్తున్నాయి. ఇప్పటివరకూ జనగామ జిల్లా ఏర్పాటు ఖాయమనుకుంటున్న తరుణంలో, యాదాద్రి జిల్లాలో కలిపే అవకాశం ఉందన్న సమాచారంతో శుక్రవారం జనగామ భగ్గుమంది.