పనుల్ని నిరంతరం పర్యవేక్షించాలి
Published Tuesday, 31 May 2016విజయవాడ (కార్పొరేషన్), మే 30: నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో ఎటువంటి నాణ్యతా లోపం లేకుండా నిరంతర పర్యవేక్షణ జరపాలని నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ విఎంసి ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. నగర పర్యటనలో భాగంగా 29వ డివిజన్ లోని ఊర్మిళా సుబ్బారావునగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. మెయిన్ రోడ్డు డ్రైయిన్ నిర్మాణం అనంతరం డ్రైయిన్కు రోడ్డుకు మధ్యగల మార్జిన్ స్థలాల్లో మట్టిని నింపకుండా గోతుల మయంగా ఉండటాన్ని గుర్తించిన ఆయన తక్షణమే మట్టిని నింపాలన్నారు.